శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr

భార్య స్నానం చేస్తుంటే నగ్నంగా చూశాడనీ...

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. తన భార్య స్నానం చేస్తుంటే నగ్నంగా చూశాడనీ ఆరేళ్ళ బాలుడిని ఓ దుర్మార్గుడు అత్యంత క్రూరంగా హత్య చేశాడు. ఈ వివరాలను పరిశీలిస్తే...

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. తన భార్య స్నానం చేస్తుంటే నగ్నంగా చూశాడనీ ఆరేళ్ళ బాలుడిని ఓ దుర్మార్గుడు అత్యంత క్రూరంగా హత్య చేశాడు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఢిల్లీ పరిధిలోని ఓఖ్లా ఫేజ్ 2లో రోహిత్ అనే వ్యక్తి తన భార్యతో కలసి నివశిస్తున్నాడు. రోహిత్ భార్య స్నానం చేస్తుండగా ఆరేళ్ళ బాలుడు చూశాడు. దీంతో ఆగ్రహంచిన రోహిత్ ఆ బాలుడిని హత్య చేశాడు. ఆ తర్వాత బాలుడి మృతదేహాన్ని బాక్స్ బెడ్‌లో భద్రపరిచాడు. పిమ్మట రోహిత్ పరారై, సెల్ ఫోన్‌ను స్విచ్చాఫ్ చేసుకున్నాడు. 
 
అయితే, తమ బిడ్డ కనిపించడం లేదనీ బాలుడి తల్లిదండ్రులు గత నెల 27వ తేదీన స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు... రోహిత్‌పై అనుమానంతో నిఘా పెట్టిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని తమదైనశైలిలో విచారించారు. 
 
ఈ విచారణలో తన భార్య స్నానం చేస్తుంటే నగ్నంగా చూశాడని, ఆపై పిచ్చి మాటలు మాట్లాడాడన్న ఆగ్రహంతో అతన్ని చంపేసినట్టు రోహిత్ విచారణలో అంగీకరించాడు. దీంతో అతనిపై హత్యా కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ ఘటన దేశ రాజధానిలో కలకలం రేపింది.