శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 10 సెప్టెంబరు 2017 (06:10 IST)

డేరా బాబా ఆ పని చేసేవాడు... శవాలను పాతిపెట్టి, మొక్కలు నాటేవాడు..

డేరా బాబాకు చెందిన నేరాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. భక్తుల నమ్మకాన్ని బాగా వాడుకున్న డేరా బాబా వారిని చంపి అవయవాలను అమ్మేసేవాడని టాక్ వస్తోంది. ఈ విషయాన్ని బాబా మాజీ భక్తు డు గురుదాస్‌ తూర్‌ తెలిపాడు. ప్రైవేట్ వైద్య శాలలకు మృత దేహాలను విక్రయ

డేరా బాబాకు చెందిన నేరాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. భక్తుల నమ్మకాన్ని బాగా వాడుకున్న డేరా బాబా వారిని చంపి అవయవాలను అమ్మేసేవాడని టాక్ వస్తోంది. ఈ విషయాన్ని బాబా మాజీ భక్తు డు గురుదాస్‌ తూర్‌ తెలిపాడు. ప్రైవేట్ వైద్య శాలలకు మృత దేహాలను విక్రయించే వాడని అతడు చెప్పాడు. లఖ్‌నవ్‌లోని ఓ ప్రైవేటు వైద్య కళాశాలకు డేరా బాబా 14 మృతదేహాలను విక్రయించాడన్న ఆరోపణలపై హరియాణా సర్కారు శుక్రవారం విచారణకు ఆదేశించిన నేపథ్యంలో అవయవాల కోసం హతమార్చిన వారిని డేరాలోనే పాతిపెట్టి... వారి శవాలపై గుర్తుకోసం మొక్కలు నాటేవారని తూర్ షాకింగ్ నిజాలను తెలిపాడు. 
 
డేరాలో చేరిన వెంటనే తమ అవయవాలను స్వచ్ఛందంగా దానం చేస్తామంటూ భక్తుల నుంచి స్వీయ ధ్రువీకరణలను తీసుకునేవారని, తర్వాత భక్తులను హతమార్చి వారి అవయవాలను అమ్ముకునేవారని గురుదాస్‌ తెలిపారు. హర్యానా, పంజాబ్‌ల్లోని ప్రైవేటు వైద్య కళాశాలలకు మృత దేహాలను బాబా విక్రయించేవాడని గురుదాస్‌ చెప్పారు.ఇందులో వైద్యుల ప్రమేయం కూడా వుందని తూర్ చెప్పుకొచ్చాడు. 
 
డేరాను నమ్మి రూ.3 కోట్లు పెట్టుబడి పెట్టిన రైతు... బాబా జైలు కెళ్లడంతో ఆత్మహత్య చేసుకున్నాడని గురుదాస్ తూర్ తెలిపాడు. హర్యానాలోని బల్‌కారా గ్రామానికి చెందిన సోంబిర్‌ కుమార్‌(47) డేరాబాబాకు చెందిన ఎంఎస్‌జీ రిసార్ట్స్‌లో రూ.3 కోట్లు పెట్టుబడి పెట్టాడు. దీని కోసం తన 32 ఎకరాలు అమ్మేశాడు. బాబా జైలుకెళ్లడంతో సోంబిర్ తన పెట్టుబడి వృధా అయ్యిందనే నిరాశతో ఆత్మహత్య చేసుకున్నాడు.