శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 3 అక్టోబరు 2017 (10:33 IST)

ముంబై తొక్కిసలాట.. మహిళను అసభ్యంగా తాకుతూ.. దోచుకున్నారు.

మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. అయితే ముంబై రైల్వే స్టేషన్‌లో బ్రిడ్జి కూలి తొక్కిసలాటలో ప్రాణాలు దక్కించుకునేందుకు జనాలు పరుగులు పెడుతున్నారు. ఆ సమయంలో సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన

మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. అయితే ముంబై రైల్వే స్టేషన్‌లో బ్రిడ్జి కూలి తొక్కిసలాటలో ప్రాణాలు దక్కించుకునేందుకు జనాలు పరుగులు పెడుతున్నారు. ఆ సమయంలో సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన చోటుచేసుకుంది. వీరు మనుషులేనా? అనిపించేలా ప్రవర్తించాడు. ఆర్తనాదాలు చేస్తుంటే మహిళల వద్ద దోచుకెళ్లారు.
 
వివరాల్లోకి వెళితే.. ముంబై తొక్కిసలాటలో ఓ మహిళ కింద పడి చావుబతుకుల మధ్య పోరాడుతుంటే ఆమెను రక్షించాల్సిన సాటి వ్యక్తులు మానవ మృగాల్లా ప్రవర్తించారు. ఆమెను అసభ్యంగా తాకుతూ, ఆమె ఒంటిపై ఉన్న నగలను కాజేసి ఎవరి  దారిన వారు వెళ్లిపోయారు. ఆమె ఆర్తనాదాలు ఎవరినీ కదిలించలేకపోయాయి. ఈ ఘటన జరిగిన కాసేపటికే ఆమె ప్రాణాలు విడిచింది. 
 
కొందరు ఈ దృశ్యాలను తమ సెల్‌ఫోన్లలో బంధించి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.