బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 23 సెప్టెంబరు 2017 (10:06 IST)

తండ్రి కాదు.. కిరాతుకుడు : భార్యపై అనుమానంతో కుమార్తెపై అత్యాచారం

అతను తండ్రికాదు.. కిరాతకుడు. కట్టుకున్న భార్యపై ఉన్న అనుమానంతో కన్నబిడ్డపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమెను హతమార్చి ఫ్యాన్‌కు ఉరివేసి, ఏమీ తెలియనట్టుగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అతను తండ్రికాదు.. కిరాతకుడు. కట్టుకున్న భార్యపై ఉన్న అనుమానంతో కన్నబిడ్డపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమెను హతమార్చి ఫ్యాన్‌కు ఉరివేసి, ఏమీ తెలియనట్టుగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతదేహానికి జరిగిన శవపరీక్షలో అత్యాచారం జరిగినట్టు తేలింది. దీంతో పైగా, బాలిక శరీరంపై లభ్యమైన అనవాళ్లతో నిందితుడి వీర్యం డీఎన్ఏ సరిపోయింది. దీంతో ఆ కసాయి తండ్రిని పోలీసులు అరెస్టు చేసి జైలుకుపంపారు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ శివార్లలో బేరేలా గ్రామానికి చెందిన బాలిక ఫ్యానుకి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని ఫోన్ రావడంతో అక్కడికి పోలీసులు చేరుకున్నారు. ఆరేళ్ల బాలిక ఫ్యాన్‌కి ఎలా ఉరి వేసుకుందో అర్థం కాని పోలీసులు అనుమానాస్పదమృతిగా కేసు నమోదు చేసి, మృతదేహాన్ని శవపరీక్షకు తరలించారు. దాన్ని బాలిక తండ్రి తీవ్రంగా అడ్డుకున్నాడు. దీంతో అతని వ్యవహారంపై పోలీసులకు అనుమానం వచ్చింది. 
 
దీంతో పోలీసులు పోస్టు మార్టంకి పంపించారు. పోస్టు‌మార్టం రిపోర్టులో బాలికపై అత్యాచారం జరిగిందని, బాలిక శరీరంపై లభ్యమైన వీర్యం డీఎన్ఏతో అతని వీర్యనమూనా సరిపోయింది. దీంతో పోలీసులు తమదైనశైలిలో అతనిని విచారించగా, తన భార్య వివాహేతర సంబంధం వల్ల ఆ పాప పుట్టిందని అందుకే, తన భార్యను షాపింగ్‌కు పంపి, బాలికను హతమార్చానని అంగీకరించాడు. దీంతో అతనిని కటకటాల వెనక్కి పంపించారు.