1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 11 జూన్ 2019 (11:31 IST)

పిల్ల ఏనుగు చనిపోతే.. తల్లి ఏనుగుతో పాటు ఏనుగుల గుంపు ఏం చేసిందంటే? (వీడియో)

మనచుట్టూ తిరుగుతున్న ఓ వ్యక్తి చనిపోతే.. ఎంతటి బాధ మనుషులకు వుంటుందో.. అదే బాధ మూగ జీవాలను వుంటుంది. బాధకు తాము అతీతులమని కాదని.. తమలోనూ భావోద్వేగాలు వుంటాయని.. తాజాగా ఈ ఏనుగులు నిరూపించాయి. 
 
ఓ ఏనుగు తన బిడ్డ చనిపోతే, దాన్ని మోసుకుంటూ రోడ్డుపైకి వచ్చింది. బాధతో దాన్ని తట్టి లేపేందుకు ప్రయత్నించింది. ఈలోగా, అక్కడికి వచ్చిన మిగతా ఏనుగులు, సంతాప సూచకంగా ఓ నిమిషం పాటు మౌనంగా నిలబడిపోయాయి. ఇంకా తల్లి ఏనుగు.. పిల్ల ఏనుగు మృతదేహాన్ని.. అడవిలోకి తీసుకెళ్లింది. 
 
పర్వీన్ అనే అటవీ అధికారి మొత్తం వీడియోను తీసి, ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా, అదిప్పుడు వైరల్ అవుతోంది. దాదాపు 20 ఏనుగుల గుంపు ఈ వీడియోలో కనిపిస్తుంది. ఇందులో మూడు గున్న ఏనుగులున్నాయి.

ఏనుగుల బృందం అలా పిల్ల ఏనుగును తీసుకెళ్తున్న దృశ్యాన్ని చాలామంది ప్రజలు కూడా వీక్షించారు. తాజాగా ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న వీడియోను మీరూ ఓ లుక్కేయండి.