బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 12 ఆగస్టు 2020 (13:46 IST)

రారా బుజ్జీ... చేపలకూర తీసుకెళ్దువుగాని, అతడు రాగానే తలుపేసేసింది, ఆపై?

ఆమెను ఒంటరితనం పక్కదారి పట్టించింది. నాలుగు రాళ్లు సంపాదించుకుని వస్తానని భర్త వృత్తి రీత్యా దుబాయ్‌లో వుంటుండగా ఈమె ఒక్కతే కోల్ కతాలో వుంటోంది. ఆమె పేరు శివాని ముఖర్జీ.

భర్త దూరంగా వుండటం ఏదో ఏడాదికి ఒక్కసారి వచ్చి సంసారం తూతూమంత్రంగా సాగించేయడం ఆమెకి ఏమాత్రం తృప్తినీయలేదు. దీనితో తను నివాసం వుండే ప్రాంతానికి కొద్ది దూరంలో ఓ ప్లేగ్రౌండులో ఆడుకునేందుకు వచ్చే 16 ఏళ్ల యువకుడిపై శివాని కన్ను పడింది.
 
ఎలాగైనా అతడిని వశం చేసుకోవాలని నిర్ణయించుకుని, మెల్లగా ప్లేగ్రౌండుకి వెళ్లేది. కొద్దిసేపు కుర్రాళ్లతో ముచ్చట్లు చెపుతూ వుండేది. ఈ క్రమంలో సదరు కుర్రాడితో మాట్లాడుతూ... ఇంటికి వచ్చి చాక్లెట్లు తీసుకెళ్లమని చెప్పింది. ఓకే ఆంటీ అంటూ అతడు ఆమెను అనుసరించాడు. ఆ తర్వాత ఇంకాస్త చనువు పెంచుకుంది. మరో రోజు ఆటాడుతున్న బాలుడిని.. రారా బుజ్జీ, చేపల కూర వండాను తీసుకెళ్దువుగాని అని పిలిచింది.
 
అతడు వెళ్లగానే గది తలుపు వేసేసింది. ఆ తర్వాత మెల్లగా అతడిని లోబరుచుకుంది. అంతేకాదు... ఆ బాలుడిని వారం పాటు ఇంట్లోనే వుంచేసుకుంది. ఆడుకునేందుకు వెళ్లిన కుమారుడు తిరిగి రాకపోవడంతో అతడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ బాలుడు శివాని ఇంట్లో వున్నట్లు కనుగొన్నారు. ఆ మహిళ ఇంట్లో ఉన్న యువకుడితో పాటు ఆమెను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.