1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 28 మే 2018 (13:36 IST)

కాంగ్రెస్ దయవల్లే సీఎం కుర్చీలో కూర్చొన్నా : కుమార స్వామి

కాంగ్రెస్ దయవల్లే తాను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొన్నట్టు కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి కుమారస్వామి గౌడ అన్నారు. ఈనెల 24వ తేదీన కన్నడ రాష్ట్ర 25వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన.. తన మంత్రివర్గా

కాంగ్రెస్ దయవల్లే తాను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొన్నట్టు కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి కుమారస్వామి గౌడ అన్నారు. ఈనెల 24వ తేదీన కన్నడ రాష్ట్ర 25వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన.. తన మంత్రివర్గాన్ని నేడో రేపో విస్తరించనున్నారు.
 
ఈ నేపథ్యంలో ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ దయ వల్లే తాను సీఎం అయినట్లు తెలిపారు. సీఎంగా కర్ణాటక రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం తన బాధ్యత అని చెప్పారు. కానీ ఏది చేయాలన్నా.. కాంగ్రెస్ నేతల అనుమతి తీసుకోవాలని, వాళ్ల పర్మిషన్ లేకుండా ఏమీ చేయలేమన్నారు. 
 
కాగా, కుమారస్వామి సీఎంగా ప్రమాణం చేసి నాలుగు రోజులు గడిచిపోయింది. అయితే ఇంకా రాష్ట్ర క్యాబినెట్‌ను మాత్రం విస్తరించలేదు. అయితే, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన తల్లి సోనియాతో కలిసి అమెరికా వెళ్లారు. మెడికల్ చెకప్ కోసం అమెరికా వెళ్తున్నట్లు రాహుల్ ట్వీట్ చేశారు. రాహుల్, సోనియా తిరిగి వచ్చిన తర్వాతే.. కర్ణాటక మంత్రిమండలిని విస్తరించే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.