శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 20 జూన్ 2018 (17:06 IST)

రైల్వే స్టేషన్‌లో పబ్లిగ్గా కానిస్టేబుల్ వక్రబుద్ధి.. ఏం చేశాడంటే...

దేశవ్యాప్తంగా మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. తాజాగా ఓ మహిళ పట్ల ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ తనలోని వక్రబుద్ధిని బయటపెట్టాడు. అదీకూడా పబ్లిగ్గా. సీసీ కెమెరాల్లో నమోదైన ఈ వివరాలను పరిశీలిస్తే,

దేశవ్యాప్తంగా మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. తాజాగా ఓ మహిళ పట్ల ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ తనలోని వక్రబుద్ధిని బయటపెట్టాడు. అదీకూడా పబ్లిగ్గా. సీసీ కెమెరాల్లో నమోదైన ఈ వివరాలను పరిశీలిస్తే..
 
ముంబై కల్యాణ్ నగరంలోని రైల్వే స్టేషన్‌లో ఇద్దరు మహిళలు ఆరో నంబర్ ప్లాట్‌ఫాంపై ఉన్న సీట్లలో కూర్చుని రైలు కోసం ఎదురుచూస్తున్నారు. వీరి పక్కనే జహంగీర్ అనే ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ కూర్చుని ఉన్నాడు. జహంగీర్ పక్కన కూర్చున్న మహిళ ఉక్కపోతగా ఉండటంతో చీర కొంగుతో గాలి విసురుకుంటోంది. దీంతో అతని వక్రబుద్ధి బయటపడింది. 
 
అంత మంది స్టేషన్‌లో ఉన్నారన్న ఇంజ్ఞితజ్ఞానం కూడా లేకుండా ఆ మహిళపై కావాలని చేయి వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. కానిస్టేబుల్ వికృత చేష్టలను ఆ మహిళ పక్కనే కూర్చున్న మరో మహిళ గమనించింది. ఆ తర్వాత ఆ మహిళ అపర కాళిమాతలా రెచ్చిపోయి కానిస్టేబుల్‌పై దాడి చేసింది. దీంతో మిగిలిన ప్రయాణికులు కూడా తలోచేయి వేసి దేహశుద్ధి చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ కానిస్టేబుల్ ఉద్యోగం కూడా ఊడింది.