గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 20 జూన్ 2018 (16:32 IST)

మత్తుమందిచ్చి మైనర్‌ను రేప్ చేసిన కొరియోగ్రాఫర్

మత్తుమందిచ్చి మైనర్ బాలికను ఓ కొరియోగ్రాఫర్ రేప్ చేశాడు. ఈ దారుణం ముంబైలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, ఓ టీవీ రియాల్టీ షో కంటెస్టెంట్ అయిన ఆదిత్య గుప్తా (20) అనే వ్యక్తి కొరియోగ్రాఫర్‌గా పని చేస్

మత్తుమందిచ్చి మైనర్ బాలికను ఓ కొరియోగ్రాఫర్ రేప్ చేశాడు. ఈ దారుణం ముంబైలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, ఓ టీవీ రియాల్టీ షో కంటెస్టెంట్ అయిన ఆదిత్య గుప్తా (20) అనే వ్యక్తి కొరియోగ్రాఫర్‌గా పని చేస్తున్నాడు. ఈయనకు ఇన్‌స్టాగ్రామ్‌లో 17 ఏళ్ల కాలేజీ విద్యార్థిని పరిచయమైంది. వారిద్దరి మధ్య కొంచెం స్నేహం ఏర్పడింది. ఈ క్రమంలో ఆమెను అపహరించి, మత్తు మందిచ్చి, ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
 
ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటన వెలుగుచూసింది. ఆ తర్వాత బాధితురాలిని ముంబైలోని బాబా హాస్పిటల్‌కు తరలించి వైద్య పరీక్షలు చేయగా, అత్యాచారానికి గురైనట్టు తేలింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.