ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : శనివారం, 16 జూన్ 2018 (17:59 IST)

యేడాది పాపపై అత్యాచారం.. ఆపై తలపై కొట్టి చంపిన మానవమృగం

మహారాష్ట్రలోని పూణెలో దారుణం జరిగింది. ఒక యేడాది వయసున్న పసికందుపై ఓ 65 యేళ్ల కామాంధుడు అత్యాచారం చేసి, ఆపై తలపై కొట్టి చంపేశాడో కసాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...

మహారాష్ట్రలోని పూణెలో దారుణం జరిగింది. ఒక యేడాది వయసున్న పసికందుపై ఓ 65 యేళ్ల కామాంధుడు అత్యాచారం చేసి, ఆపై తలపై కొట్టి చంపేశాడో కసాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
తమిళనాడుకు చెందిన ఓ జంట పొట్టచేతపట్టుకుని మహారాష్ట్రలోని పూణెకు వలస వచ్చి శివారు ప్రాంతాల్లో నివశిస్తోంది. ఈ దంపతులిద్దరూ కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఓ యేడాది పాప ఉంది. గురువారం అర్థరాత్రి వారి పాప కనిపించకపోవడంతో రాత్రంతా పాప కోసం గాలించారు.
 
అయినప్పటికీ ఆచూకీ తెలియకపోవడంతో కల్బోర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ వీధిలో ఉన్న సీసీటీవీ పుటేజీలను పరిశీలించారు. ఇందులో ఓ వ్యక్తి పాపను ఎత్తుకెళ్లడం అందులో స్పష్టంగా కనిపించింది. 
 
దీంతో ఆరా తీసిన పోలీసులు ఆ వ్యక్తిని పట్టుకొని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. ఆ చిన్నారిపై అత్యాచారం నెరిపిన అనంతరం తలపై కొట్టి చంపేసినట్టు పోలీసులు విచారణ అనంతరం చెప్పాడు. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తిని మల్హరి బన్సోడేగా గుర్తించారు. చిన్నారి నిద్రపోతుండగా ఎత్తుకెళ్లి రేప్ చేసి చంపేసినట్టు నేరాన్ని అంగీకరించాడు. ఈ కామాంధుడి వయసు 65 యేళ్లని పోలీసులు తెలిపారు.