శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 13 నవంబరు 2017 (12:45 IST)

కొనసాగుతున్న ఐటీ సోదాలు... శశికళ వంద బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్

అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ, ఆ పార్టీ బహిష్కృత నేత టీటీవీ దినకరన్‌లతో పాటు.. ఆయన కుటుంబ సభ్యులు, అనుచరుల గృహాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు ఐదో రోజు కూడా సోదాలు కొనసాగిస్తున్నారు.

అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ, ఆ పార్టీ బహిష్కృత నేత టీటీవీ దినకరన్‌లతో పాటు.. ఆయన కుటుంబ సభ్యులు, అనుచరుల గృహాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు ఐదో రోజు కూడా సోదాలు కొనసాగిస్తున్నారు. అంటే, గత ఐదు రోజులుగా మన్నార్గుడి మాఫియాను లక్ష్యంగా చేసుకుని ఈ సోదాలు కొనసాగుతున్నాయి. 
 
పెద్ద నోట్ల రద్దు సమయంలో వీరంతా భారీ ఎత్తున అవకతవకలకు పాల్పడటమే కాకుండా, భారీ మొత్తంలో పన్ను ఎగవేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు సాగుతున్న విషయం తెల్సిందే. ఈ దాడుల్లో శశికళకు చెందిన సంస్థల్లో కోట్లాది రూపాయల అక్రమాలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో 20 డొల్ల కంపెనీలకు డబ్బులు తరలించినట్టు ఐటీ అధికారులు గుర్తించారు. 
 
ఇందుకు సంబంధించిన వంద బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేశారు. తొలిరోజు దాడుల్లో సుమారు వెయ్యి కోట్ల మేర పన్ను ఎగవేతకు పాల్పడినట్టు గుర్తించిన సంగతి తెలిసిందే. రెండో రోజు దాడుల్లో వజ్రవైఢూర్యాలు, బంగారు, వెండ సంపదను గుర్తించినట్టు వార్తలు వెలువడ్డాయి. ఇక మూడవరోజు పలు స్తిరాస్థులకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.