శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 17 డిశెంబరు 2017 (16:56 IST)

సీపీఐ పార్టీ బ్యానర్‌లో కిమ్ జాంగ్.. బీజేపీ సెటైర్లు

ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్న ఫొటో సీపీఐ పార్టీ బ్యానర్‌లో కనిపించడం సంచలనం రేకెత్తిస్తోంది. వరుస అణు ప్రయోగాలతో అలజడి సృష్టిస్తూ ప్రపంచ దేశాలను వణికిస్తున్న కిమ్ జాంబ్ ఫోటో సీపీఐ బ్యానర్‍‌లో కని

ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్న ఫొటో సీపీఐ పార్టీ బ్యానర్‌లో కనిపించడం సంచలనం రేకెత్తిస్తోంది. వరుస అణు ప్రయోగాలతో అలజడి సృష్టిస్తూ ప్రపంచ దేశాలను వణికిస్తున్న కిమ్ జాంబ్ ఫోటో సీపీఐ బ్యానర్‍‌లో కనిపించడంపై రాజకీయంగా చర్చ సాగుతోంది. డిసెంబర్ 16, 17 తేదీల్లో కేరళలోని నడుమ్‌కందంలో సీపీఐ-ఎం పార్టీ సమావేశాన్ని నిర్వహిస్తోంది.
 
ఈ సభలో పాల్గొనే సీపీఎం క్యాడర్‌కు స్వాగతం పలుకుతూ వెలసిన ఫ్లెక్సీలో కిమ్ జాంగ్ ఫోటో వుండటం సంచలనానికి తావిస్తోంది. ఆ ఫ్లెక్సీలో ఇంకెవరి ఫొటో లేకపోవడం చర్చకు దారితీసింది. దీనిపై భారతీయ జనతా పార్టీ మండిపడింది.

కేరళలో వరుసగా ఆరెస్సెస్ కార్యకర్తలు హత్యలకు గురికావడానికి ఇదే కారణమని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ఆరోపించారు. భారత్‌లో వున్న బీజేపీ, ఆరెస్సెస్ కార్యాలయాలపై కిమ్ జాంగ్ తరహాలో సీపీఐ అణు క్షిపణులను వేయదని ఆశిస్తున్నామని ట్విట్టర్లో సంబిత్ సెటైర్లు వేశారు. కేరళలో సీపీఐ హత్యాకాండను కొనసాగిస్తోందని మండిపడ్డారు.