1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 26 జనవరి 2019 (18:50 IST)

క్రిమినల్ కేసులున్న వ్యక్తికి భారత రత్న ఇస్తారా? కేఏ పాల్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారత్ రత్న పురస్కార అవార్డు ప్రకటించడాన్ని కేఎల్ పాల్ తప్పు బట్టారు. క్రిమినల్ కేసులన్న వ్యక్తికి అత్యున్నత పురస్కార అవార్డు ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు. 
 
ప్రపంచశాంతి కోసం పాటుబడ్డ లోక్‌సభ మాజీ స్పీకర్ దివంగత బాలయోగికి అవార్డు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. దళితుడనే కారణంగా బాలయోగికి పురస్కారం ఇవ్వలేదా? అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు.
 
ప్రణబ్‌పై అమెరికాలో తమ సంస్థ క్రిమినల్ కేసులు వేసిందని అమెరికా నుంచి ప్రణబ్‌కు సమన్లు కూడా అందాయని పాల్ గుర్తు చేశారు. లోక్‌సభలో మెజార్టీ ఉంది కదా అని... ఎవరికి పడితే వారికి భారతరత్న ఇచ్చేస్తారా? అని మండిపడ్డారు. 
 
2004లో కేంద్ర మంత్రి ప్రణబ్, ఏపీ సీఎం వైఎస్ఆర్‌లు.. ఇద్దరూ కలసి ప్రపంచ శాంతి కోసం పని చేస్తున్న గ్లోబల్ పీస్ సంస్థను అడ్డుకున్నారని కేఏ పాల్ మండిపడ్డారు.