శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 4 జులై 2018 (18:24 IST)

సవతి తల్లి గదిలోకి వెళ్లి.. లైంగిక దాడికి పాల్పడిన కామాంధుడు.. ఎక్కడ?

ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. సవతి తల్లిపై 26 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ జిల్లా సెద్ పుర గ్రామంల

ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. సవతి తల్లిపై 26 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ జిల్లా సెద్ పుర గ్రామంలో 26 ఏళ్ల యువకుడు ఇంట్లో నిద్రిస్తున్న సవతి తల్లి (36) గదిలోకి చొరబడి, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.


తాగిన మైకంలో ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటనపై బాధితురాలు తిత్వాయ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 
 
ఇదిలా ఉంటే.. పొరుగింటి మహిళతో పరిచయం పెంచుకున్న ఓ కామాంధుడు ఆమెకు తెలియకుండానే స్నానాల గదిలో స్పై కెమెరా అమర్చాడు. తర్వాత ఆమె స్నానం చేస్తుండగా రికార్డయిన వీడియోను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశాడు. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో ఈ ఘటన చోటుటేసుకుంది.

వ్యాపారవేత్త అయిన నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఇప్పటివరకు పోలీసులు అదుపులోకి తీసుకోలేదు. ఇమ్రుల్ తండ్రి స్థానిక తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత కావడంతో అరెస్ట్ చేయడం లేదని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది.