గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 4 మార్చి 2018 (12:57 IST)

యూపీలో కేసీఆర్ ప్రకంపనలు.. చేతులు కలుపుతున్న బద్ధశత్రువులు

దేశంలో సరికొత్త మార్పు రావాలనీ, ఇందుకోసం జాతీయ స్థాయిలో రెండో కూటమో.. థర్డ్ ఫ్రంటో ఏర్పాటు కావాల్సిన తరుణం ఆసన్నమైందంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం చేసిన వ్యాఖ్యలు దేశంలోనేకాకుండా బీజే

దేశంలో సరికొత్త మార్పు రావాలనీ, ఇందుకోసం జాతీయ స్థాయిలో రెండో కూటమో.. థర్డ్ ఫ్రంటో ఏర్పాటు కావాల్సిన తరుణం ఆసన్నమైందంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం చేసిన వ్యాఖ్యలు దేశంలోనేకాకుండా బీజేపీలో ప్రకంపనలు రేపుతున్నాయి. కేసీఆర్ పిలుపునకు దేశవ్యాప్తంగా సానుకూల స్పందనవస్తోంది. 
 
ఇందులోభాగంగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బద్ధశత్రువులుగా ఉన్న ఇద్దరు చేతులు కలుపనున్నారు. వారు ఎవరో కాదు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతిలు. వీరిద్దరూ త్వరలో జరిగే గోరఖ్‌పూర్, ఫుల్‌పూర్ ఎంపీ సీట్ల ఉప ఎన్నికల కోసం చేతులు కలపనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదే జరిగితే దేశ రాజకీయాల్లో పెను సంచలనమన్నట్టే.
 
ఎందుకంటే గతంలో ఈ రెండు పార్టీలు అధికారం కోసం హోరాహోరాగా పోరాడాయి. ఇరు పార్టీల కార్యకర్తలు, నేతలు కొట్టుకున్న సందర్భాలూ ఉన్నాయి. అలాంటి బద్ధశత్రువులుగా ఉండే ఎస్పీ, బీఎస్పీలు ఇపుడు చేతులు కలిపితే నిజంగానే దేశంలో పెను సంచలనంగా మారనుంది. దీంతో దేశ రాజకీయాల్లో పెను మార్పులకు శ్రీకారం చుట్టినట్టే.