శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 31 జులై 2018 (12:17 IST)

మానసిక వికలాంగురాలిపై 10 మంది అత్యాచారం... ఎక్కడ?

మేఘాలయా రాష్ట్రంలో ఓ మానసిక వికలాంగురాలిపై అత్యాచారం జరిగింది. రాష్ట్రంలోని నార్త్‌ గారో హిల్స్‌ జిల్లాలో ఈ దారుణం జరిగింది. అదీ కూడా రెండు నెలలుగా కామాంధులు ఈ దారుణానికి పాల్పడుతూ వచ్చారు. ఆలస్యంగా వ

మేఘాలయా రాష్ట్రంలో ఓ మానసిక వికలాంగురాలిపై అత్యాచారం జరిగింది. రాష్ట్రంలోని నార్త్‌ గారో హిల్స్‌ జిల్లాలో ఈ దారుణం జరిగింది. అదీ కూడా రెండు నెలలుగా కామాంధులు ఈ దారుణానికి పాల్పడుతూ వచ్చారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే...
 
గారో హిల్స్‌ జిల్లాలోని హల్వాపరా గ్రామానికి చెందిన 13 ఏళ్ల మానసిక వికలాంగురాలిపై అదే గ్రామానికి చెందిన 10 మంది వ్యక్తులు రెండునెలలుగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఇందులో ఇద్దరు మైనర్లున్నారు. 
 
ఈ విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణానికి సంబంధించి ఇప్పటివరకు తొమ్మిది మందిని అరెస్ట్‌ చేశారు.