1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 2 ఫిబ్రవరి 2019 (09:27 IST)

ప్రియుడుతో కలిసి అసభ్యభంగిమలో తల్లి... కళ్లారా చూసిన కుమార్తె.. ఆపై....

తన తల్లి పరాయి వ్యక్తితో చూడకూడని భంగిమలో ఉండటాన్ని ఓ బాలిక చూసింది. పైగా, ఈ విషయాన్ని నాన్నతో పాటు.. తాతతో చెబుతానని తల్లిని కుమార్తె హెచ్చరించింది. అంతే.. ఆ తల్లి కసాయిగా మారిపోయింది. హర్యానా రాష్ట్రంలోని కర్నాల్ పట్టణంలో వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కర్నాల్ పట్టణానికి చెందిన ఓ లక్ష్మి అనే మహిళకు సోనమ్ అనే పదేళ్ళ కుమార్తె ఉంది. లక్ష్మికి అదే ప్రాంతానికి చెందిన అనంత్ కుమార్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఒకరోజు ఆ చిన్నారి ఆడుకునేందుకు బయటకు వెళ్లింది. ఇంటికి తిరిగివచ్చిన ఆ చిన్నారి... తన తల్లి లక్ష్మి ఆమె ప్రియుడు అమిత్ కుమార్‌తో అభ్యంతరకర పరిస్థితిలో ఉండటాన్ని చూసింది. ఈ విషయమైన తండ్రితో చెబుతానని హెచ్చరించింది.
 
దీంతో భయపడిపోయిన తల్లి, ఆమె ప్రియుడు కలిసి ఆ చిన్నారిని అమానుషంగా హతమార్చారు. తర్వాత ఆ చిన్నారి మృతదేహాన్ని నదిలో పడవేశారు. అయితే సోనమ్ అదృశ్యమైన నేపథ్యంలో పోలీసు కేసు నమోదైంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారించగా, అసలు విషయం వెలుగు చూసింది. దీంతో లక్ష్మితో పాటు అనంత్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు.