1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 2 ఫిబ్రవరి 2019 (11:01 IST)

బీహార్‌లో సినీ ఫక్కీలో లైవ్ ‌ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులు...

బీహార్ పోలీసులు సినీ ఫక్కీలో లైవ్‌ఎన్‌కౌంటర్ చేశారు. బస్సులో దాగిన కరుడుగట్టిన నేరస్తుడిని అందరూ చూస్తుండగానే కాల్చి చంపారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బీహార్ రాష్ట్రంలోని ముజఫర్‌పూర్ పట్టణ బస్టాండులో ఆగివున్న ఓ క్రిమినల్ దాగివున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. పైగా, వాడిని చంపేయాలంటూ పోలీసులను కోరారు. దీంతో ఆ బస్సును చుట్టుముట్టిన పోలీసులు.. బస్సుల అద్దాలు పగులగొట్టి దుండగుడిపై కాల్పులు జరిపి ఆ క్రిమినల్‌ను హత్య మట్టుబెట్టారు. 
 
నిజానికి ఈ క్రిమినల్‌ను హత్య చేసేందుకు పది మంది నేరగాళ్లు ఆ బస్సు వద్దకు వచ్చారు. ఇంతలో పోలీసులు వస్తున్నట్టు విషయం తెలుసుకుని వారంతా అక్కడ నుంచి పారిపోయారు. ఆ తర్వాత పోలీసులు ఓ నేరస్థుడుని లొంగిపోవాలంటూ కోరారు. అందుకు ఆ క్రిమినల్ నిరాకరించడంతో అతడు పోలీసులపై కాల్పులు జరపడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 
 
శుక్రవారం ముజఫర్‌పూర్ బస్టాండ్‌ సమీంపంలో చోటు చేసుకున్న ఈ ఎన్‌కౌంటర్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. పట్టపగలో జనం రద్దీగా ఉన్న ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరగడంతో ప్రజలు భయాందోళలనలకు గురయ్యారు.