1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 6 మే 2018 (15:38 IST)

నమాజ్ రోడ్లపై చేయకండి... హర్యానా సీఎం ఖట్టర్

భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఒకటి హర్యానా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ ఉన్నారు. ఈయన తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లిం సోదరులు చేసే పవిత్ర నమాజ్‌(ప్రార్థన)పై ఈ వ్యాఖ్య

భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఒకటి హర్యానా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ ఉన్నారు. ఈయన తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లిం సోదరులు చేసే పవిత్ర నమాజ్‌(ప్రార్థన)పై ఈ వ్యాఖ్యలు చేశారు. నమాజ్ మసీదులు, ఈద్గాల్లో చదవండి.. రోడ్లపై కాదంటూ వ్యాఖ్యానించారు.
 
హర్యానాలో నమాజ్‌కు పదేపదే అడ్డంకులు ఎదురవుతుండటంపై స్పందిస్తూ శాంతిభద్రతలను పరిరక్షించడం తమ బాధ్యత అని చెప్పారు. నమాజ్‌ను బహిరంగంగా చదవడం చాలా ఎక్కువైపోయింది. మసీదుల్లో చదివితే బాగుంటుంది అని ఖట్టర్ అన్నారు. హర్యానాలోని గురుగ్రామ్‌లో కొన్ని అతివాద గ్రూపులు నమాజ్‌కు అడ్డు తగిలిన రెండు రోజులకే ఖట్టర్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 
 
కొందరు చుట్టుపక్కల ప్రాంతాన్ని కూడా మసీదులో కలిపేసుకోవాలని చూస్తున్నారంటూ రెండు వారాలుగా గురుగ్రామ్‌లో హిందుత్వ గ్రూపులు శుక్రవారం ప్రార్థనలకు అడ్డు తగులుతున్నాయి. మొన్న శుక్రవారం కూడా నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రార్థనలకు అడ్డంకులు ఎదురయ్యాయి. ప్రార్థనలు జరుగుతున్న ప్రతిచోటుకి వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్, హిందూ క్రాంతి దళ్, గోరక్షక్ దళ్, శివసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు.