గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 9 ఏప్రియల్ 2018 (16:30 IST)

ఢిల్లీలో గన్ కల్చర్.. టీవీ జర్నలిస్ట్‌పై దుండగుల కాల్పులు

ఢిల్లీలో గన్ కల్చర్ వచ్చేసింది. దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని ఘజియాబాద్‌లో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఓ టీవీ జర్నలిస్ట్‌పై గుర్తుతెలియని ఇద్దరు దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలై

ఢిల్లీలో గన్ కల్చర్ వచ్చేసింది. దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని ఘజియాబాద్‌లో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఓ టీవీ జర్నలిస్ట్‌పై గుర్తుతెలియని ఇద్దరు దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన జర్నలిస్ట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 
 
వివరాల్లోకి వెళితే.. ''సహారా సమయ్''‌ అనే న్యూస్‌ ఛానల్‌లో అనుజ్‌ చౌదరీ జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం ఇద్దరు దుండగులు ద్విచక్రవాహనాలపై వచ్చి అనుజ్‌ ఇంట్లోకి అడుగెట్టారు. ఆపై కాల్పులు జరిపి పారిపోయారు. కాల్పుల్లో బాధితుడి పొట్ట.. కుడిచేతిలో బుల్లెట్లు దిగాయి. వెంటనే అతన్ని కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అనుజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే వుందని వైద్యులు తెలిపారు. 
 
బీఎస్పీ కౌన్సిలర్ భర్త జర్నలిస్ట్ అనూజ్‌ చౌదరీ కావడంతో వ్యక్తిగత కక్షలతోనే ఈ దాడి జరిగి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. పరారీలో వున్న దుండగుల కోసం నాలుగు పోలీసు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.