గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 11 ఆగస్టు 2018 (11:12 IST)

ఆవు, పంది మాంసం తినే నెహ్రూను పండిట్ అంటారా?: అహూజా

ఆవుల్ని చంపడం ఉగ్రవాదం కంటే పెద్ద నేరమని.. లవ్ జీహాద్ పేరుతో ముస్లింలు బలవంతపు మత మార్పిడులకు పాల్పడుతున్నారని గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జరిగే సగం అత్యాచారాలకు జవహర్ లాల్ నెహ్రూ విశ్

ఆవుల్ని చంపడం ఉగ్రవాదం కంటే పెద్ద నేరమని.. లవ్ జీహాద్ పేరుతో ముస్లింలు బలవంతపు మత మార్పిడులకు పాల్పడుతున్నారని గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జరిగే సగం అత్యాచారాలకు జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) విద్యార్థులే కారణమని కూడా అహూజా ఆరోపించారు. 
 
తాజాగా భారత తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూపై రాజస్థాన్ బీజేపీ ఎమ్మెల్యే గయాన్ దేవ్ అహూజా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఆవు, పంది మాసం తినే నెహ్రూ అసలు పండిటే కాదని విమర్శించారు. కేవలం ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ నెహ్రూ పేరు ముందు పండిట్ అని చేర్చిందని వెల్లడించారు. రాజస్థాన్‌లోని ఆళ్వార్‌లో ఎమ్మెల్యే క్వార్టర్స్‌ను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ''నెహ్రూ పండిట్ కాదు. ఆయన బీఫ్, పందిమాసం తినేవారు. ఇవి తినేవారిని పండిట్ అని ఎలా అంటారు? అని ప్రశ్నించారు.
 
కేవలం ఓట్లు పొందేందుకు కాంగ్రెస్ పార్టీ నెహ్రూ పార్టీ ముందు పండిట్ అనే పదాన్ని చేర్చిందని అహుజా విమర్శలు గుప్పించారు. అహూజా వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదమై వ్యాఖ్యలపై రాజస్తాన్ పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలెట్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.