గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By

యాత్రికుడికి నేచురోతపతి మసాజ్ చేసిన ఎస్పీ..

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాన్వార్ యాత్ర జరుగుతోంది. ఈ యాత్రకు వచ్చే యాత్రికుల సౌకర్యార్థం షాప్లీలో నేచురోతపతి క్యాంపును ఏర్పాటు చేశారు. దీన్ని ప్రారంభోత్సవానికి జిల్లా ఎస్పీ అజయ్ కుమార్‌ను ఆహ్వానించారు. అయితే, ఎస్పీ అంటే ఆ స్థాయి హూందాతనం వేరు, కానీ, ఆయన వాటినన్నింటిని పక్కనబెట్టి ఓ సాధారణ మనిషిలా నడుచుకున్నారు. ఓ యాత్రికుడి కాళ్లకు మసాజ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియోలో వైరల్ అవుతోంది. 
 
షామ్లీలో ఏర్పాటు చేసిన చురోపతి క్యాంప్‌ను ప్రారంభించాల్సిందిగా అజయ్‌ కుమార్‌కు ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ఓ యాత్రికుడికి కాళ్లకు మసాజ్‌ చేశారు. ఈ సందర్భంగా తీసిన వీడియో వైరల్‌ అవుతోంది. ఒక ఐపీఎస్ అధికారి..  పోలీస్ అంటే సర్వీస్ అనేలా ప్రవర్తించిన తీరుపై డిపార్ట్‌మెంట్  ఉన్నతాధికారులు కూడా అభినందనలు తెలుపుతున్నారు.