గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 10 జూన్ 2017 (17:37 IST)

బంగారంపై ఆశ.. కుమార్తెను చంపి కళ్ళెదుటే అత్యాచారం.. గుడ్లప్పగించి చూసిన తల్లిదండ్రులు...

బంగారంపై ఆశతో కళ్లెదుటే కన్నబిడ్డపై అత్యాచారం జరుగుతుంటే ఆ తల్లిదండ్రులు మాత్రం గుడ్లప్పగించి చూస్తుండిపోయారు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజి జిల్లాలో జరిగింది. శనివారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలన

బంగారంపై ఆశతో కళ్లెదుటే కన్నబిడ్డపై అత్యాచారం జరుగుతుంటే ఆ తల్లిదండ్రులు మాత్రం గుడ్లప్పగించి చూస్తుండిపోయారు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజి జిల్లాలో జరిగింది. శనివారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఈ జిల్లాకు చెందిన మహావీర్‌ ప్రసాద్‌ అనే వ్యక్తి బంగారు వ్యాపారం చేస్తూ నష్టాలు రావడంతో ఆర్థికంగా కష్టాల్లో కూరుకుపోయాడు. విషయం తెలిసిన కృష్ణ శర్మ అనే మంత్రగాడు తాను చెప్పినట్లు చేస్తే 5 కేజీల బంగారం దొరుకుతుందని ప్రసాద్‌ దంపతులను నమ్మించాడు. 
 
ఇందుకోసం 15 యేళ్ళ వయసున్న ప్రసాద్ కుమార్తె కవితతో త్యాగం పూజ చేయించాల్సి ఉంటుందని చెప్పడంతో ప్రసాద్ దంపతులు సమ్మతించారు. ఆ తర్వాత కవితకు మత్తు కలిపిన జలాన్ని మంత్రగాడు తాపించాడు. దీంతో ఆ యువతి అపస్మారక స్థితిలోకి జారుకుంది. ఆ తర్వాత తల్లిదండ్రుల ఎదుటే మంత్రగాడు ఆ యువతిని వివస్త్రను చేసి అత్యాచారం చేశాడు. 
 
ఆ తర్వాత గొంతు నులిమి చంపేశాడు. ఆమె శవాన్ని పొలాల్లో పడేసే ముందు కూడా మరోమారు తల్లిదండ్రుల ఎదుటే అత్యాచారం జరిపాడు. బంగారం దొరక్కపోవడంతో తాము మోసపోయినట్టు గ్రహించిన ప్రసాద్ మంత్రగాడు కృష్ణ శర్మపై మహావీర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయంవెలుగు చూసింది.