శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 3 నవంబరు 2017 (17:39 IST)

మంత్రులూ... అశోక్‌ను చూసి నేర్చుకోండయ్యా? మోడీ ప్రశంస

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి అశోక గజపతి రాజుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి మంచి ప్రశంస లభించింది. పైగా, మంత్రి అశోక్‌ను చూసి ప్రతి మంత్రీ నేర్చుకోవాలంటూ హితవు పలికారు. ఇంతకీ ప్రధాన

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి అశోక గజపతి రాజుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి మంచి ప్రశంస లభించింది. పైగా, మంత్రి అశోక్‌ను చూసి ప్రతి మంత్రీ నేర్చుకోవాలంటూ హితవు పలికారు. ఇంతకీ ప్రధాని ఈతరహా వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటేనే విషయాన్ని పరిశీలిస్తే.. 
 
రాజ వంశానికి చెందిన అశోక్ గజపతి రాజు... కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ ఆయన ఒక సాధారణ పౌరుడిలాగే ఉంటారు. ఎక్కడ కూడా రాజుననే గర్వం ఆయనలో మచ్చుకైనా కనిపించదు. అలాగే, వీఐపీ కల్చర్‌కు ఆమడదూరంలో ఉంటారు. ఈ లక్షణమే మోడీని ఎంతగానో ఆకర్షించింది. 
 
దీనికి కారణం లేకపోలేదు. అశోక్ గజపతి రాజు కేంద్ర కేబినెట్‌లో పౌర విమానయాన శాఖా మంత్రిగా ఉన్నప్పటికీ సాధారణ ప్రయాణికుని వలే ప్రయాణిస్తారు. కేంద్రమంత్రిగా ఆయన నేరుగా వెళ్లి విమానం ఎక్కే అవకాశం ఉంది. కానీ అశోక్ గజపతి రాజు అలా చేయరు. తనిఖీలు నిర్వహించే వారు వెళ్ళండి సర్ అని చెప్పినా ఆయన వెళ్లరు. 
 
తనిఖీ చేయడం మీ డ్యూటీ. చేయండి తప్పు లేదు అని అంటారు. మినానాశ్రయానికి చేరుకోవడానికి ఆయన మెట్రో రైలులో ప్రయాణిస్తారట. ఇలా నిడారంబరంగా మెలుగుతుండటంతో అశోక్ గజపతి రాజుపై మోడీ దృష్టి పడింది. మంత్రులంతా అశోక్ గజపతి రాజుని ఆదర్శంగా తీసుకోవాలని ప్రధాని సూచించారంటే నిజంగా విశేషమే మరి.