శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 23 సెప్టెంబరు 2017 (10:17 IST)

రాకెట్‌లా పెరిగిన ప్రధాని మోడీ ఆస్తుల విలువ.. ఎలా?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆస్తుల విలువ తారాజువ్వలా పెరిగాయి. గత రెండేళ్ళ వ్యవధిలోనే ఆయన ఆస్తుల విలువ ఏకంగా 42 శాతం మేరకు పెరిగాయి. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయ వెబ్‌సైట్‌లో పేర్కొనడం జరిగింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆస్తుల విలువ తారాజువ్వలా పెరిగాయి. గత రెండేళ్ళ వ్యవధిలోనే ఆయన ఆస్తుల విలువ ఏకంగా 42 శాతం మేరకు పెరిగాయి. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయ వెబ్‌సైట్‌లో పేర్కొనడం జరిగింది. ఈ వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల మేరకు.. ప్రధాని నరేంద్ర మోడీ ఆస్తుల విలువ 41.8 శాతం పెరిగి రూ.1.41 కోట్ల నుంచి రూ.2 కోట్లకు పెరిగాయి. మరో కేంద్రమంత్రి సదానంద గౌడ ఆస్తులు 42.3 శాతం పెరిగి రూ.4.65 కోట్ల నుంచి రూ.6.62 కోట్లకు చేరుకున్నాయి.
 
అలాగే, కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, గనుల శాఖామంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఆస్తులు 2015-17 మధ్య భారీగా పెరగ్గా, మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆస్తులు ఈ రెండేళ్ల కాలంలో కరిగిపోయాయి. కానీ, ఈయన సతీమణి ప్రచ్చి జవదేవకర్ ఆస్తుల విలువ మాత్రం ఏకంగా 190 శాతం మేరకు పెరగడం గమనార్హం. అంటే, నరేంద్ర సింగ్ తోమర్ ఆస్తులు 67.5 శాతం పెరిగి రూ.53 లక్షల నుంచి రూ.89 లక్షలకు చేరుకోగా, ప్రకాశ్ జవదేకర్ ఆస్తుల విలువ 50 శాతం తగ్గి రూ.1.11 కోట్ల నుంచి రూ.56 లక్షలకు చేరుకుంది. 
 
అలాగే, ఉక్కు మంత్రి చౌధరీ వీరేందర్ సింగ్ సంపద 23.5 శాతం పెరిగి రూ.7.97 కోట్ల నుంచి  రూ.9.85 కోట్లకు చేరుకోగా, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఆస్తులు రూ.4.55 కోట్ల నుంచి రూ.5.34 కోట్లకు, వీకే సింగ్ ఆస్తులు రూ.69 లక్షల నుంచి రూ.78 లక్షలకు పెరిగాయి. పౌరవిమానయాన శాఖా మంత్రి అశోక్ గజపతి రాజు ఆస్తులు 11.7 శాతం పెరిగి రూ.6.98 కోట్ల నుంచి రూ.7.80 కోట్లకు చేరుకున్నాయి. 
 
ఇతర కేంద్ర మంత్రులైన రామ్ విలాస్ పాశ్వాన్ (30.8 శాతం), జేపీ నడ్డా (14.6 శాతం), అరుణ్ జైట్లీ (4.3 శాతం) ఆస్తులు కూడా క్షీణించాయి. కానీ పాశ్వాన్ ఆస్తుల్లో క్షీణత నమోదు కాగా వారి భార్యల ఆస్తులు మాత్రం రాకెట్ స్పీడ్‌తో పెరిగాయి. పాశ్వాన్ సతీమణి రీనా పాశ్వాన్ ఆస్తులు కూడా 14.9 శాతం పెరిగినట్టు ఈ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.