శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 16 నవంబరు 2017 (13:08 IST)

కసాయి తండ్రి దారుణం.. కుమార్తెను వ్యభిచారంలోకి దించి...

మహారాష్ట్ర రాష్ట్రంలోని పూణెలో ఓ కన్నతండ్రి కసాయిగా మారిపోయాడు. ఫలితంగా కుమార్తెపై అఘాయిత్యానికి పాల్పడి వ్యభిచారంలోకి దించాడు. అంటే వ్యభిచార గృహానికి లక్ష రూపాయలకు కుమార్తెను అమ్మేశాడు.

మహారాష్ట్ర రాష్ట్రంలోని పూణెలో ఓ కన్నతండ్రి కసాయిగా మారిపోయాడు. ఫలితంగా కుమార్తెపై అఘాయిత్యానికి పాల్పడి వ్యభిచారంలోకి దించాడు. అంటే వ్యభిచార గృహానికి లక్ష రూపాయలకు కుమార్తెను అమ్మేశాడు. సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, పూణెకు చెందిన ఓ కన్నతండ్రి తన 16 యేళ్ల కుమార్తెపై తొలుత అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఎరవాడ భిచార గృహానికి విక్రయించాడు. 
 
నిజానికి ఈయన భార్య 2010వ సంవత్సరంలో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో తండ్రిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. తండ్రి మూడేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించి విడుదలై వచ్చాక మరో మహిళను పెళ్లాడినా నిత్యం కూతురిపై కూడా అత్యాచారం చేశాడు. 
 
బాలిక గర్భం ధరించకుండా మారుతల్లి మాత్రలు తినిపించేదని బాధిత బాలిక పోలీసులకు చెప్పింది. అనంతరం 2016లో సాక్షాత్తూ తండ్రి కూతురిని లక్షరూపాయలకు వ్యభిచార గృహానికి విక్రయించాడు. వ్యభిచార గృహంలో మగ్గుతున్న బాలికకు పోలీసులు దాడి చేసి కాపాడి బాలసదనానికి తరలించారు. బాలికపై అత్యాచారం, వ్యభిచారపు రొంపిలోకి దించిన వారిపై కేసులు నమోదు చేసుకున్న పోలీసులు తండ్రి,మారుతల్లి, వ్యభిచార గృహం నిర్వాహకురాళ్లను అరెస్టు చేశారు.