శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 4 అక్టోబరు 2017 (09:52 IST)

ఈనెల 25వ తేదీన రాహుల్‌కు పట్టాభిషేకం

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పట్టాభిషేకానికి సర్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం ఈనెల 25ను ముహూర్తంగా నిర్ణయించినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు మంగళవారం కాంగ్రెస్ పార్టీ సెంట్రల

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పట్టాభిషేకానికి సర్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం ఈనెల 25ను ముహూర్తంగా నిర్ణయించినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు మంగళవారం కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ ఆధ్వర్యంలో పీసీసీ అధ్యక్షులు, ప్రదేశ్ రిటర్నింగ్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు.
 
ఏఐసీసీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ నెల 10 నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కాగా, రాహుల్ గాంధీ దీపావళి తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టనున్నట్టు రాజస్థాన్‌కు చెందిన ఆ పార్టీ నేత సచిన్ పైలట్ రెండు రోజుల క్రితమే వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ జరుగుతోందని తెలిపారు. 
 
కాగా, ప్రస్తుతం పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీకి అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలంటూ ఆ పార్టీ నేతలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా సోనియా గాంధీ అనారోగ్యం బారిన పడిన తర్వాత ఈ డిమాండ్లు ఊపందుకున్నాయి.