గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 3 డిశెంబరు 2018 (16:07 IST)

గెలిపిస్తే బాల్య వివాహాలను ప్రోత్సహిస్తా : బీజేపీ అభ్యర్థి

రాజస్థాన్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్ త్వరలో జరుగనుంది. ఇందుకోసం అన్ని పార్టీల అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సౌజత్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేబీ అభ్యర్థిగా శోభ చౌహాన్ పోటీ చేస్తున్నారు. ఈమె పీపాలియా కాలా ప్రాంతంలో ప్రసంగిస్తూ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.
 
తనకు ఓట్లు వేసి గెలిపిస్తే బాల్య వివాహాలను ప్రోత్సహిస్తానని, బాల్య వివాహాలను పోలీసులు అడ్డుకోకుండా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. దేశంలో బాల్య వివాహాలు నిషేధం. అలాంటిది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి ఈ తరహా హామీ ఇవ్వడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 
 
ముఖ్యంగా విపక్షాలకు చెందిన రాజకీయ నేతలు శోభతో పాటు బీజేపీపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వ్యక్తి, ఓ దురాచారాన్ని ప్రోత్సహిస్తూ మాట్లాడటమేంటంటూ సామాజిక మాధ్యమాల్లో సైతం పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.