మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 18 సెప్టెంబరు 2017 (12:25 IST)

కన్నతల్లిపై రెండేళ్ల పాటు కుమారుడి అత్యాచారం.. ఎక్కడ?

మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వావివరసలు మంటగలిసిపోతున్నాయి. జన్మనిచ్చిన కన్నతల్లిని చంపేసేసిన ఘటనలున్నాయి. అయితే ఓ కిరాతకుడు కన్నతల్లిపైనే అత్యాచారం చేశాడు. అదీ 70ఏళ్ల వృద్ధురాలైన కన్నతల్

మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వావివరసలు మంటగలిసిపోతున్నాయి. జన్మనిచ్చిన కన్నతల్లిని చంపేసేసిన ఘటనలున్నాయి. అయితే ఓ కిరాతకుడు కన్నతల్లిపైనే అత్యాచారం చేశాడు. అదీ 70ఏళ్ల వృద్ధురాలైన కన్నతల్లిపై 45 ఏళ్ల కుమారుడు రెండేళ్ల పాటు లైంగికంగా దాడి చేశాడు. మద్యం మత్తులో ఆమెను చిత్రహింసలు పెట్టడంతో పాటు కన్నతల్లి అనే విషయాన్ని కూడా మరిచిపోయి క్రూరమృగంలా ప్రవర్తించాడు. ఈ ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. పంజాబ్‌కి చెందిన బాటాలా అనే గ్రామంలో ఓ ముదుసలికి నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలున్నారు. ఆ వృద్ధురాలు మద్యానికి బానిసైన తన కుమారుడితో నివాసం ఉంటుంది. తాగుబోతు అయిన 45ఏళ్ల వ్యక్తి నుంచి భార్య, పిల్లలు దూరంగా వుంటున్నారు. 
 
అయితే రోజూ తాగి కన్నతల్లిని హింసించే కుమారుడు.. రెండేళ్ల పాటు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దురాగతాన్ని ఆ తల్లి బయటికి చెప్పుకోలేక దిగమింగుకుంది. కానీ ఈ విషయం ఆ బాధితురాలి కుమార్తెకు తెలియరావడంతో  ఆ కామాంధుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.