శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 6 నవంబరు 2018 (09:35 IST)

దీపావళి రోజున రెండు గంటలే.. పట్టించుకోని తమిళ తంబీలు..

దీపావళి రోజు టపాసులు రెండు గంటలు మాత్రమే పేల్చాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. పెద్దమొత్తంలో టపాసులు కాల్చడం వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతోందని, దేశవ్యాప్తంగా వాటిపై నిషేధం విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.


ఈ పిటిషన్లపై విచారణ పూర్తి చేసిన న్యాయస్థానం తాజాగా తీర్పు వెలువరించింది. టపాసుల విక్రయాలను పూర్తిగా నిషేధించడం కుదరదని, అయితే అమ్మకాలకు కొన్ని షరతులు వర్తిస్తాయని స్పష్టం చేసింది.  దీపావళి నాడు రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య మాత్రమే టపాసులు కాల్చేందుకు అనుమతినిచ్చింది. 
 
ఇక క్రిస్మస్‌, నూతన సంవత్సరం నాడు అర్ధరాత్రి 11.55 నుంచి 12.30 గంటల మధ్య టపాసులు కాల్చాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు తీర్పును తమిళ తంబీలు పట్టించుకోలేదు. నరక చతుర్దశి సందర్భంగా గతంలో ఎన్నడూ లేనంతగా రోడ్లపైకి వచ్చి మరీ టపాకాయాలు కాల్చారు యువత. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తమిళనాడు వాసులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. తమ మనోభావాలకు ఈ తీర్పు వ్యతిరేకమని చెప్తున్నారు. సుప్రీం ఆదేశాలను రాష్ట్రంలోని ఏ జిల్లాలోనూ వీటిని పాటించిన పరిస్థితి కనిపించలేదు.