కుటుంబ శ్రేయస్సు కోసం కుమార్తెను చంపేసిన కన్నతండ్రి?  
                                       
                  
                  				  ఆ యువతి పాలిట కన్నతండ్రే కాలయముడయ్యాడు. కుటుంబం బాగు కోసం ఏకంగా కన్నబిడ్డనే హత్య చేశాడో కసాయి తండ్రి. ఈ దారుణం తమిళనాడు రాష్ట్రంలోని పుదుక్కోట్టై జిల్లా కాందవర్ కోట్టైలో జరిగింది. 
				  											
																													
									  
	 
	తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కాందవర్ కోట్టై ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి మంత్రశక్తులపై గుడ్డినమ్మకం. కుమార్తెను చంపితే కుటుంబంలో ఉన్న బాధల నుంచి విముక్తి పొంది.. సంతోషంగా ఉంటారని ఓ మహిళా మంత్రగత్తె చెప్పింది. అంతే.. ఆ వ్యక్తి ఇంకేం ఆలోచన చేయకుండా కుమార్తెను గొంతు నులిమి చంపేశాడు. 
				  
	 
	ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని తండ్రితో పాటు కుమార్తె హత్యకు సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.