శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 22 మార్చి 2019 (14:21 IST)

నిన్న కికీ ఛాలెంజ్.. ఇపుడు మైక్రోవేవ్ ఛాలెంజ్... ఎలా చేయాలి?

సోషల్ మీడియాకు విశేష ఆదరణ లభించిన తర్వాత చేసే ప్రతి పనీ ఇపుడు వైరల్ అవుతోంది. ఇందులోభాగంగా, గతంలో కికీ ఛాలెంజ్ పేరుతో ఏ గేమ్ వచ్చింది. ఇది ప్రతి ఒక్కర్నీ అమితంగా ఆకట్టుకుంది. ఈ కికీ ఛాలెంజ్‌కు ప్రపంచ వ్యాప్తంగా జనాలు వెర్రెత్తిపోయారు. ఇపుడు కొత్తగా మైక్రోవేవ్ ఛాలెంజ్ వచ్చింది. ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్నవారు వాటి వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తున్నారు. 
 
సాధారణంగా మైక్రోవేవ్ అంటే ఎందుకు ఉపయోగిస్తారో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఆహార పదార్థాలను వేడి చేసేందుకు దీన్ని ఉపయోగిస్తుంటారు. పైగా, ఇతరత్రా ఫుడ్ ఐటెమ్స్ అందులో నిల్వ ఉంచుతుంటారు. అయితే అందులో ఫుడ్ పెట్టిన తర్వాత అది తిరుగుతుంటుంటుంది. 
 
మైక్రోవేవ్ ఓవెన్‌లో ఎలాగైతే తిరుగుతుందో.. అలాగే, మైక్రోవేవ్ ఛాలెంజ్‌లో తిరగాలన్నమాట. నేలపై కూర్చొని ఏదైనా ఆహార పదార్థాలను తీసుకుని వాటితో రౌండ్‌గా తిరగాలి. దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ జత చేసి షేర్ చేయాలి. ప్రస్తుతం మైక్రోవేవ్ ఛాలెంజ్ సోషల్ మీడియాలో ట్రెండ్‌గా మారింది.