బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (12:58 IST)

ఎయిరో ఇండియా రిహార్సల్స్... ఢీకొట్టిన జెట్ విమానాలు...

బెంగుళూరులో విషాదం జరిగింది. రెండు జెట్ విమానాలు గగనతలంలో ఢీకొట్టాయి. ఎయిరో ఇండియా 2019 షో కోసం రిహార్సల్ చేస్తుండగా బెంగుళూరులోని యెలహంక ఎయిర్‌బేస్‌లో ఈ అపశ్రుతి చోటుచేసుకుంది. 
 
ఈ నెల 20న బెంగళూరులో ఎయిరో ఇండియా 2019 ప్రదర్శన ప్రారంభంకానుంది. ఫిబ్రవరి 20-24 మధ్య జరగనున్న ప్ర‌ద‌ర్శ‌న‌లో అంత‌ర్జాతీయ విమాన‌యాన సంస్థ‌లు త‌మ అత్యాధునిక ఉత్ప‌త్తుల‌ను ప్ర‌ద‌ర్శించ‌నున్నాయి.
 
ఇందుకోసం పైల‌ట్లు రిహార్స‌ల్స్ చేస్తుండగా, సూర్య‌కిర‌ణ్ ఏయిరోబాటిక్స్ టీమ్‌కు చెందిన రెండు జెట్ విమానాలు గాల్లో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పైలెట్లు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఘ‌ట‌న స‌మ‌యంలో ముగ్గురు పైల‌ట్లు జెట్ విమానాల్లో ఉన్న‌ట్లు స‌మాచారం. దుర్ఘటన జరిగిన ప్రాంతమంతా పొగమయమైంది.