శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 4 జనవరి 2019 (12:09 IST)

ఆవులను పోలీసు స్టేషన్‌లలో కట్టేయండి.. యూపీ సీఎం ఆర్డర్

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఆ రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న ఓ నిర్ణయం ఇపుడు విస్తుపోయేలా చేస్తోంది. మరికొంతమందిని నువ్వులపాల్జేస్తోంది. గోవుల సంరక్షణా చర్యల్లో భాగంగా ఆవులకు సరిపడా షెడ్లు లేకుంటే ఆయా ప్రాంతాల్లో ఉన్న పోలీసు స్టేషన్‌లలో కట్టేయాలని మంత్రివర్గం ఆదేశించింది. ఇది యూపీ పాలకులను నవ్వులపాలు చేస్తోంది. 
 
యూపీ సర్కారు గోవుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా, గో కళ్యాణ్ పేరిట సెస్‌ను వసూలు చేస్తోంది. ఈ నిర్ణయంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ యూపీ సర్కారు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. 
 
ఇదేసమయంలో ఆవుల సంరక్షణకు పట్టణ, గ్రామీణ పౌర సంస్థల ఆధ్వర్యంలో తాత్కాలికంగా గోవంశ్‌ ఆశ్రయ్‌ ఆస్థల్‌లను ఏర్పాటు చేసే ప్రతిపాదనలను కూడా మంత్రివర్గం ఆమోదించింది. దీనికి అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా ఆవుల సంరక్షణ కోసం తాత్కాలికంగా షెడ్లు ఏర్పాటు చేయనున్నారు. ఒకవేళ ఆవులకు సరిపడా షెడ్లు లేకున్నా, దొరకకపోయినా స్థానికంగా ఉండే పోలీస్ స్టేషన్లలో ఆవులను కట్టేయాల్సిందిగా కేబినెట్ ఆదేశించింది.