శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 9 నవంబరు 2017 (16:58 IST)

బైకర్స్ ఛేజ్ : సింహాలతో చెడుగుడు... (వీడియో)

పులి కనిపిస్తే పరుగో పరుగు. సింహం గాండ్రింపు వింటే ఒళ్లంతా వణుకే.. అలాంటిది ఆ కుర్రోళ్లు చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. గుజరాత్ సౌరాష్ట్ర ప్రాంతంలోని అమ్రేలి జిల్లాలో గిర్ అటవీ ప్రాంతం విస్తర

పులి కనిపిస్తే పరుగో పరుగు. సింహం గాండ్రింపు వింటే ఒళ్లంతా వణుకే.. అలాంటిది ఆ కుర్రోళ్లు చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. గుజరాత్ సౌరాష్ట్ర ప్రాంతంలోని అమ్రేలి జిల్లాలో గిర్ అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. పులుల సంరక్షణలో భాగంగా ఇక్కడ అనేక ఆంక్షలు అమల్లో ఉన్నాయి. 
 
దీంతో ఇటీవల పులులు, సింహాల సంఖ్య గిర్ అటవీ ప్రాంతంలో బాగా పెరిగింది. సుమారు 400 పులులు, సింహాలు ఉన్నట్లు సమాచారం. అలాంటి ప్రాంతంలో నలుగురు యువకులు.. రెండు బైక్స్‌పై సింహం పిల్లలను తరుముతూ.. వాటిని ఆట పట్టిస్తూ.. బైకులు చేసే శబ్దాలు, ఆ యువకుల అరుపులకు భయపడిన సింహం పిల్లలు పరిగెడుతూ ఉంటాయి. అయినా వదిలిపెట్టకుండా ఆ యువకులు వాటిని వెంబడిస్తున్నారు. 
 
ఈ వీడియో చర్చనీయాంశం అవ్వటంతో గుజరాత్ అటవీ శాఖ విచారణ చేపట్టింది. ఆ యువకులు ఎవరు.. ఏ ప్రాంతం వారు అనే విషయాలపై ఆరా తీస్తోంది. బండి నెంబర్లు ఆధారంగా రాజ్‌కోట్ ప్రాంతం వారిగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.