శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సందీప్
Last Updated : బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (12:22 IST)

యువతిని బంధించి అత్యాచారం చేసిన నకిలీ ఖాకీలు.. ఎక్కడ?

ఓ యువతిని గదిలో బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. పోలీసునంటూ అబద్ధాలు చెప్పి తీసుకువెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నలసోపారాలోని ప్రగతినగర్‌కు చెందిన బాధితురాలి ఇంటికి ఈ నెల 6వ తేదీన పోలీసునంటూ ఓ వ్యక్తి వచ్చాడు. ఆమె భర్తను ఓ కేసు మీద అరెస్ట్ చేసామని, అతడిని విడిపించుకోవాలంటే తనతోపాటు రావాలని కోరాడు. దీంతో 21 యేళ్ళ యువతి అతని మాటలు నమ్మి అతని వెంట ఆటోలో ఎక్కి వెళ్లింది. 
 
ఆ తర్వాత ఉత్తర ముంబైలోని మలద్‌లో ఉన్న ఓ ఇంట్లో ఎనిమిది రోజులుపాటు బంధించాడు. ఈ దారుణానికి ఓ మహిళతోపాటు నలుగురు సహాయం చేశారు. బంధించిన ఆమెను ఇద్దరు వ్యక్తులు పదే పదే అత్యాచారం చేశారు. ఆ తర్వాత మీరా రోడ్డులో నిర్మాణంలో ఉన్న మరో ఇంటికి బదిలీ చేశారు.

అక్కడ కూడా ఆ వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ ఇంట్లో ఈ నెల 18 వరకూ బంధీగా ఉంచారు. 18వ తేదీన వారు ఆమెను విడిచిపెట్టగానే సరాసరి పోలీసుల వద్దకు వెళ్లింది. జరిగిందంతా వివరించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.