శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సందీప్ రేవిళ్ళ
Last Modified: మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (18:29 IST)

నీ భర్తను విడిచిపెట్టాలంటే నువ్వు రావాలంటూ తీస్కెళ్లి 13 రోజుల పాటు...

అబలపై మరో అత్యాచార దుర్ఘటన జరిగింది. 13 రోజుల పాటు బందీగా ఉంచి సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. పోలీసునంటూ అబద్ధాలు చెప్పి తీసుకువెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. నలసోపారాలోని ప్రగతినగర్‌కు చెందిన బాధితురాలి ఇంటికి ఈ నెల 6వ తేదీన పోలీసునంటూ ఓ వ్యక్తి వచ్చాడు. 
 
ఆమె భర్తను ఓ కేసు మీద అరెస్ట్ చేసామని, అతడిని విడిపించుకోవాలంటే తనతోపాటు రావాలని కొత్తగా పెళ్లైన ఆ యువతికి (21) చెప్పాడు. అది నమ్మి వచ్చిన ఆ యువతిని ఆటోలో తీసుకువెళ్లాడు. ఉత్తర ముంబయిలో మలద్‌లో ఉన్న ఓ ఇంట్లో ఎనిమిది రోజులుపాటు బంధించాడు. ఈ దారుణానికి ఓ మహిళతో పాటు నలుగురు సహాయం చేసారు. 
 
బంధించిన ఆమెపై ఇద్దరు వ్యక్తులు పదేపదే అత్యాచారం చేసారు. ఆ తర్వాత మీరా రోడ్డులో నిర్మాణంలో ఉన్న మరో ఇంటికి బదిలీ చేశారు. ఆక్కడ కూడా ఆ వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ ఇంట్లో ఈ నెల 18 వరకూ బందీగా ఉంచారు. 18వ తేదీన వారు ఆమెను విడిచిపెట్టగానే సరాసరి పోలీసుల వద్దకు వెళ్లింది. జరిగిందంతా వివరించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.