శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 21 ఏప్రియల్ 2018 (12:09 IST)

పెళ్లిపీటలపై వధూవరులు.. వధువు మెడలో పూలమాల వేసిన యువకుడు... తర్వాత?

పెళ్లిపీటలపై వధూవరులు కూర్చొనివున్నారు. వధువు మెడలో మరికొన్ని క్షణాల్లో మూడుముళ్లు వేయాల్సివుంది. ఇంతలో ఎక్కడ నుంచో వచ్చిన ఓ యువకుడు ఉన్నట్టుండి వధువు మెడలో ఓ పూలమాల వేశాడు.

పెళ్లిపీటలపై వధూవరులు కూర్చొనివున్నారు. వధువు మెడలో మరికొన్ని క్షణాల్లో మూడుముళ్లు వేయాల్సివుంది. ఇంతలో ఎక్కడ నుంచో వచ్చిన ఓ యువకుడు ఉన్నట్టుండి వధువు మెడలో ఓ పూలమాల వేశాడు. అంతే.. అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. పైగా, పెళ్లిపీటలపై ఉన్న వరుడు కూడా ఒకింతి షాక్‌కు గురై, నిశ్చేష్టుడైపోపాయాడు. ఇంతలో వధువు కూడా పెళ్లిపీటలపై నుంచి లేచివచ్చి మరో మాలను యువకుడి మెడలో వేసింది. ఆ తర్వాత వధువు బంధువులంతా కలిసి ఆ యువకుడిని చితకబాదగా, జరిగిన ఘటనతో షాక్‌తిన్న వరుడు కుటుంబ సభ్యులు మండపం నుంచి వెళ్లిపోయారు. దీంతో పెళ్లి ఆగిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నగీనా జిల్లాలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నగీనా జిల్లాలో యువతీయువకుడికి పెళ్లి చేసేందుకు పెద్దలు నిర్ణయించారు. ఈ పెళ్లి తతంగం అంతా ఓ మండపంలో నిర్వహించసాగారు. ఇంతలో 24 ఏళ్ల రాహుల్ అనే యువకుడు పెళ్లి జరుగుతున్న వేడుక దగ్గరకు బైక్ మీద వచ్చాడు. ఆ తర్వాత స్టేజ్‌‌కు కొంచం దూరంలో నిలబడి, తన చేతిలో ఉన్న పూలమాలను తీసి వధువు వైపు విసిరాడు. 
 
ఆ మాల నేరుగా వెళ్లి పెళ్లి కుమార్తె మెడలో పడింది. దీంతో అక్కడున్న బంధుమిత్రులంతా ఒక్కసారి అవాక్కయ్యారు. పెళ్లి కూతురు కూడా ఆ అబ్బాయి దగ్గరకు వచ్చి తన మెడలో ఉన్న పూలమాలను అతని మెడలో వేసింది. ఆ షాక్ నుంచి కోలుకునేందుకు అతిథులకు టైం పట్టింది. 
 
అయితే వధువు తరపున బంధువులు వచ్చి ఆ అబ్బాయిని చితకబాదారు. వరుడు తరపున బంధువులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. దీంతో పెళ్లి ఆగిపోయింది. ఇక పోలీసులు వచ్చి ఆ అబ్బాయిని అరెస్టు చేశారు. అమ్మాయి దళితురాలు కాగా, అబ్బాయి ఉన్నత కులానికి చెందినట్లు తెలుస్తోంది. ఆ ఇద్దరూ ఒకే కాలేజీలో చదువుకున్నట్టు సమాచారం.