శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By ivr
Last Modified: బుధవారం, 31 డిశెంబరు 2014 (22:15 IST)

2015లో ధనుస్సు రాశి వారి ఫలితాలు ఇలా ఉన్నాయి...

మూల 1, 2, 3, 4 పాదములు (యే, యో, బా, బి)
పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు (భూ, ధ, భా, ఢ)
ఉత్తరాషాఢ 1వ పాదము (భే)
ఆదాయం 2, వ్యయం 8, పూజ్యత 6, అవమానం 1

 
ధనుస్సు రాశివారికి జూలై 14 వరకు అష్టమము నందు బృహస్పతి, ఆ తదుపరి అంతా భాగ్యము నందు, ఈ సంవత్సరం అంతా రాజ్యము నందు రాహువు, చతుర్థము నందు కేతువు, ఈ సంవత్సరం అంతా వ్యయము నందు శని సంచరిస్తారు. 
 
ఈ రాశివారి గోచారం పరీక్షించగా.. 'పూర్వదత్తేషు యా ధనం' అన్న వాస్తవాన్ని గుర్తిస్తారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమయినప్పటికీ బంధు మిత్రుల సహకారంతో వాటిని అధికమిస్తారు. విద్యా, సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. భాగస్వామిక వ్యవహారాల్లో మెళకువ అవసరం. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుట మంచిది. స్త్రీల ఓర్పు, నేర్పుకు పరీక్షా సమయం అని గుర్తించండి. స్థిర, చరాస్తుల అమ్మకానికై చేయు యత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు తోటివారితో చికాకులు, అధికారుల ఒత్తిడి తప్పదు. కార్మిక, పారిశ్రామిక బాంధవ్యాలు మెరగవుతాయి. కొబ్బరి, పండ్ల, పూల, పానీయ వ్యాపారులకు కలిసిరాగలదు. పెద్దలను, ప్రముఖులను కలుసుకోగలుగుతారు. 
 
రవాణా, ఎగుమతి, ఆటోమొబైల్ రంగాల్లో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం కానవస్తుంది. నిరుద్యోగులకు సత్ కాలం. మీ సంతానం కోసం ధనం బాగుగా వెచ్చించవలసి వస్తుంది. విదేశీయాన యత్నాలు ఫలిస్తాయి. ఫైనాన్స్, చిట్స్, రంగాల్లో వారికి ఒత్తిడి అధికమవుతుంది. ప్రయాణాలలో ఒకింత ఇబ్బందులు తప్పవు. వైద్య రంగాల్లో వారికి అనుకూలత, అభివృద్ధి కానవస్తుంది. ఆడిటర్లకు చికాకులు తప్పవు. రవాణా రంగాల్లో వారికి సుంకం సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రాజకీయాల్లో వారికి మంచి పేరు, ప్రతిష్టలు లభిస్తాయి. 
 
ప్రముఖులను, పెద్దలను కలుసుకోగలుగుతారు. అవివాహితులకు అనుకున్న సంబంధాలు నిశ్చయం కాగలవు. వాతావరణంలో మార్పులు మీకెంతో ఆందోళనం కలిగిస్తుంది. వ్యవసాయ, తోటల రంగాల్లో వారికి చికాకు తప్పదు. రిప్రజెంటేటివ్‌లకు, ప్రైవేటు సంస్థల్లో వారికి మార్పులు అనుకూలిస్తాయి. బంగారం, వెండి, లోహ వ్యాపారస్తులకు కలిసివచ్చే కాలం. న్యాయవాద వృత్తుల్లో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. 
 
ఈ రాశివారికి ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల లక్ష్మీగణపతిని తెల్లని పూలతో పూజించడం వల్ల సర్వదా పురోభివృద్ధి కానవస్తుంది. జూలై వరకు అష్టమ గురుదోషం వల్ల ప్రతి గురువారం సాయిబాబా గుడిలో ఉండే ధునితో 16 రావి సమిధలను వేసిన సర్వదోషాలు తొలగిపోతాయి. ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల ప్రతి శనివారం ఈ క్రింది శ్లోకాన్ని 19 సార్లు ఠించిన సర్వదా శుభం కలుగుతుంది. 
 
"ఓం రవి సుతాయ విద్మహే మందగ్రహాయ ధీమహి తన్నః శని ప్రచోదయాత్"
 
** మూలా లక్షత్రం వారు వేగి చెట్టును, పూర్వాషాఢ నక్షత్రం వారు నిమ్మ, ఉత్తరాషాఢ నక్షత్రం వారు పనస చెట్టును ఖాళీ ప్రదేశాల్లో గానీ, దేవాలయాల్లో గానీ, విద్యా సంస్థల్లో గానీ నాటి వాటి అభివృద్ధికి దోహద పడిన శుభం కలుగును. 
 
మూల నక్షత్రం వారు కృష్ణవైఢూర్యం, పూర్వాషాఢ వారు వజ్రం, ఉత్తరాషాఢ వారు స్టార్‌రూబి లేక జాతికెంపును ధరించిన శుభం కలుగుతుంది. ఈ రాశివారు ఇష్టకామేశ్వరి దేవిని, ఆంజనేయుని ఆరాధించినా మనోసిద్ధి చేకూరుతుంది. విద్యార్థులు, విద్యాభివృద్ధికి దక్షిణామూర్తిని ఆరాధించడం వలన సర్వదా శుభం కలుగగలదు.