శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By selvi
Last Updated : సోమవారం, 9 ఏప్రియల్ 2018 (15:39 IST)

భర్త భార్యకు ఆ పువ్వులు కొనిపెడితే.. ఏం జరుగుతుందో తెలుసా?

ఉద్యోగం, వ్యాపారాల్లో రాణించాలంటే.. ఈ చిన్ని చిట్కా పాటించండి అంటున్నారు.. ఆధ్యాత్మిక పండితులు. ప్రతిరోజూ మీ సతీమణికి మల్లెపువ్వులు కొనివ్వండని చెప్తున్నారు. ఆ పువ్వులతో సతీమణి అలంకరించుకుంటే.. శుక్రగ

ఉద్యోగం, వ్యాపారాల్లో రాణించాలంటే.. ఈ చిన్ని చిట్కా పాటించండి అంటున్నారు.. ఆధ్యాత్మిక పండితులు. ప్రతిరోజూ మీ సతీమణికి మల్లెపువ్వులు కొనివ్వండని చెప్తున్నారు. ఆ పువ్వులతో సతీమణి అలంకరించుకుంటే.. శుక్రగ్రహ అనుగ్రహంతో ఆ ఇంట లక్ష్మీదేవి కొలువై వుంటుంది. అందుకే ఇంటి గృహలక్ష్మి శుచిగా వుండాలని నుదుట కుంకుమ బొట్టు.. కుదుళ్లలో పువ్వులతో అలంకరించుకునే వారింట ఆర్థిక ఇబ్బందులు వుండవని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. 
 
అందుకే సువాసన భరితమైన జాజి, విరజాజి, మల్లెపువ్వులను ధర్మపత్నికి కొనివ్వడం ద్వారా వృత్తిపరంగా సానుకూల ఫలితాలుంటాయి. అలాగే ఇల్లు కళగా వుండాలి. అంటే ఇంటిని శుభ్రంగా వుంచుకుని.. పూజలు చేయాలి. ఇంట్లో బూజు పట్టకుండా వుండేలా చూసుకోవాలి. దుమ్ముధూళి లేకుండా ఆరు బయట కూడా శుచిగా వుంచుకోవాలి. 
 
ఇల్లు ఇల్లాలు కళగా ఉంటే లక్ష్మీదేవి పిలవకుండానే వస్తుందట. కనుక ఇంటి లోపల శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు బయటివైపు గోడలు రంగు వెలసిపోతే సున్నం వేయించాలి. ఇలా చేస్తే ఆ ఇంటికి లక్ష్మి కళ వస్తుందని.. తద్వారా ఉద్యోగం, వ్యాపారాల్లో పురుషులు రాణిస్తారని పండితులు చెప్తున్నారు.