శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : శుక్రవారం, 17 అక్టోబరు 2014 (20:02 IST)

శనివారం ధర్మం చేయండి... శనీశ్వరుడు శాంతిస్తాడు..!

నవగ్రహాల ప్రభావం అంతా ఇంతా కాదు. ఇందులో శనీశ్వరుడి గ్రహ ప్రభావం జాతకులను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగిస్తుంది. అయితే శనివారం శనీశ్వరుడు కొన్ని కార్యాలు చేయడం ద్వారా శాంతిస్తాడని, తద్వారా జాతకులకు కాసింత ఇక్కట్లు పెట్టడని పంచాంగ నిపుణులు అంటున్నారు. 
 
అవేంటంటే.. మంచి మనసుతో తలపెట్టే వివిధ ధర్మకార్యాల ద్వారా శనిని శాంతింపజేయవచ్చునట. ధర్మం చేయడం, పేదలకు దానం చేయడం వంటి కార్యాల ద్వారా తన గ్రహ ప్రభావం ఉన్నప్పటికీ శనీశ్వరుడు అనుగ్రహిస్తాడని పండితులు చెబుతున్నారు. 
 
దేవాలయాల నిర్మాణంతో పాటు వాటి అభివృద్ధికి పాటుపడటం, దైవ సంబంధిత కార్యాల్లో పాల్గొనడం, అనాధలకు, వృద్ధులకు, నిరుపేదలకు చేతనైన సాయం చేయడం ద్వారా శనిగ్రహ ప్రభావం నుంచి తప్పించుకోవచ్చు.  
 
ఇలా మంచిపనులు చేసుకుంటూ పోతే శనీశ్వరుడి మనస్సు కరుగుతుందట. అప్పుడు శనిభగవానుడి ప్రతికూలత తగ్గిపోయి... అనుకూలత పెరిగిపోతుందని.. ఫలితంగా శని సంబంధమైన దోషాలు తొలగిపోతుందని, అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.