బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : మంగళవారం, 27 నవంబరు 2018 (17:24 IST)

రాహు-కేతువులను జంధ్యంలా ధరించే కాలభైరవుని పూజిస్తే..?

తారకాసురుని సంహరించేందుకు శివుని హాలహాలం నుంచి కాళిని పార్వతీ దేవి ఉద్భవింపజేసింది. ఓ మహిళ చేతులారా తారకాసురుడు సంహరించబడుతాడనే వరం పొంది వుండటంతో కాళికాదేవి అతనిని సంహరిస్తుంది. ఆ తాపంతో కాళీమాత ఎనిమిది చిన్నారులుగా మారింది. ఆ ఎనిమిది మంది చిన్నారులను ఏకం చేసిన శివుడు.. ఆ రూపానికి భైరవుడనే పేరు పెట్టారు. 
 
అందుకే కొన్ని ఆలయాల్లో అష్ట భైరవుని సన్నిధానం వుంటుంది. అందుకే శుక్లపక్ష అష్టమి రోజున కాలభైరవుడికి నేతితో దీపమెలిగించడం లేదా నువ్వులతో దీపం వెలిగించడం ద్వారా నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. 
 
12 రాశులు కాలచక్రంలో నిక్షిప్తమైవుంటాయి. ఈ రాశుల్లో పుట్టే ప్రజలను సంరక్షించే పనిని కాల భైరవునికే చెందుతుంది. అందుకే ఆయనను కాల భైరవుడని పిలుస్తారు. తలలో మేషం, నోటిలో వృషభం, చేతుల్లో మిథునం, ఛాతిలో కర్కాటకం, బొజ్జలో సింహం, నడుములో కన్య, పిరుదుల్లో తులాం, వెనుక భాగంలో వృశ్చికం, తొడలపై ధనుస్సు, మోకాలులో మకరం, కింది కాలి భాగంలో కుంభం, పాదంలో మీనం అనే రాశులుంటాయి. 
 
రాహు, కేతువులను కాల భైరవుడు జంధ్యంలా ధరించివుంటాడు. అందుకే కాలభైరవుడిని పూజిస్తే.. గ్రహదోషాలను తొలగించుకోవచ్చునని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.