నవగ్రహ దోషాలు: తెల్ల జిల్లేడుతో చేసిన గణపతిని పూజిస్తే!?
నవగ్రహ దోషాల నివారణకు గణపతిని పూజిస్తే సరిపోతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఎలాంటి దోషాన్నైనా తొలగించుకోవాలంటే గణేశ ఆరాధన చేయాల్సిందేనని వారు అంటున్నారు.
ముఖ్యంగా నవగ్రహ దోషాల్లో ఏ దోషానికైనా గణపతి పూజ ఎంతో మేలు చేస్తుంది.
* సూర్యదోష నివారణకు ఎర్రచందనంతో గణపతిని పూజిస్తే సత్ఫలితాన్నిస్తుంది.
* అలాగే కేతు దోష నివారణకు తెల్లజిల్లేడుతో చేసిన గణపతిని పూజిస్తే సరిపోతుంది.
* చంద్ర దోష నివారణకు వెండి లేక పాలరాయితో చేసిన వినాయకుడిని పూజించాలి.
* కుజదోష నివారణకు రాగితో చేసిన వినాయకుడిని పూజిస్తే ఫలితం ఉంటుంది.
* గురు దోష నివారణకు పసుపు, చందనం లేక బంగారంతో చేసిన గణపతిని కొలవాలి.
* బుధ దోష నివారణకు మరకత గణపతిని అర్చించాలి.
* శుక్ర దోష నివారణకు స్ఫటిక గణపతికి ఆరాధన చేయాలి
* రాహు గ్రహ దోషానికి మట్టితో చేసిన గణపతిని పూజిస్తే ఫలితం ఉంటుంది.
ఇంకా స్ఫటిక గణపతిని పూజిస్తే సుఖశాంతులను ప్రసాదిస్తాడు.
పాలరాయితో చేసిన గణపతిని పూజిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది.
పగడపు గణపతి పూజించడం వల్ల అప్పుల బాధలు తొలగిపోతాయి.