శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : శనివారం, 19 జులై 2014 (16:16 IST)

నవగ్రహ దోషాలు: తెల్ల జిల్లేడుతో చేసిన గణపతిని పూజిస్తే!?

నవగ్రహ దోషాల నివారణకు గణపతిని పూజిస్తే సరిపోతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఎలాంటి దోషాన్నైనా తొలగించుకోవాలంటే గణేశ ఆరాధన చేయాల్సిందేనని వారు అంటున్నారు. 
 
ముఖ్యంగా నవగ్రహ దోషాల్లో ఏ దోషానికైనా గణపతి పూజ ఎంతో మేలు చేస్తుంది. 
 
* సూర్యదోష నివారణకు ఎర్రచందనంతో గణపతిని పూజిస్తే సత్ఫలితాన్నిస్తుంది. 
 
* అలాగే కేతు దోష నివారణకు తెల్లజిల్లేడుతో చేసిన గణపతిని పూజిస్తే సరిపోతుంది.
 
* చంద్ర దోష నివారణకు వెండి లేక పాలరాయితో చేసిన వినాయకుడిని పూజించాలి. 
 
*  కుజదోష నివారణకు రాగితో చేసిన వినాయకుడిని పూజిస్తే ఫలితం ఉంటుంది. 
 
* గురు దోష నివారణకు పసుపు, చందనం లేక బంగారంతో చేసిన గణపతిని కొలవాలి. 
*  బుధ దోష నివారణకు మరకత గణపతిని అర్చించాలి. 
* శుక్ర దోష నివారణకు స్ఫటిక గణపతికి ఆరాధన చేయాలి
* రాహు గ్రహ దోషానికి మట్టితో చేసిన గణపతిని పూజిస్తే ఫలితం ఉంటుంది. 
 
ఇంకా స్ఫటిక గణపతిని పూజిస్తే సుఖశాంతులను ప్రసాదిస్తాడు. 
పాలరాయితో చేసిన గణపతిని పూజిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది. 
పగడపు గణపతి పూజించడం వల్ల అప్పుల బాధలు తొలగిపోతాయి.