శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : బుధవారం, 1 జులై 2015 (18:33 IST)

హోమ భస్మాన్ని నేలపై ఉంచకూడదట.. విభూతి నవగ్రహ దోషాలను..?

సాధారణంగా హోమంలో దర్బలు, ఇతరత్రా హోమ వస్తువులు వేసి దహిస్తారు. హోమం ప్రక్రియ పూర్తికాగా.. మిగిలిన భస్మాన్నే విభూతి అంటారు. పవిత్రంగా భావించబడే విభూతి ప్రతి శివాలయంలోనూ ఉంటుంది.

అయితే ఈ హోమభస్మాన్ని నుదుట ధరించిన తర్వాత నేలపై రాల్చేయడం.. ఆలయ గోడలపై విదిలించడం వంటివి చేయకూడదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. హోమ భస్మాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేలపై ఉంచకూడదట. అలా ఉంచితే దోషాలు తప్పవంటున్నారు. విభూతిని నుదుటన ధరించడం ద్వారా నవగ్రహ దోషాలు, ఈతి బాధలు తొలగిపోతాయని పంచాంగ నిపుణులు అంటున్నారు. 
 
హోమం భస్మాన్ని ధరించడం ద్వారా అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి. దేవుని అనుగ్రహంతో అనుకున్న పనులు నిరాటకంగా జరిగిపోతాయి. అంతేగాకుండా అన్ని రకాల గోచర, అగోచర, దృశ్య, అదృశ్య రోగాల నుంచి నివారణ లభిస్తుంది.

విఘ్నేశ్వరుడైన శ్రీ మహాగణపతి హోమంలోని భస్మాన్ని ఉపయోగించడం ద్వారా పనులు నిర్విఘ్నంగా జరుగుతాయి. నవగ్రహ హోమంలోని భస్మాన్ని ధరించడం ద్వారా గ్రహాల ద్వారా ఏర్పడే చెడు ప్రభావం ఉండబోదని పంచాంగ నిపుణులు చెబుతున్నారు.