బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By TJ
Last Updated : శనివారం, 30 డిశెంబరు 2017 (19:55 IST)

దిష్టిని తొలగించే... 'శుభదృష్టి గణపతి'ని ఉత్తర దిశలో వుంచితే?

కీడు కలిగించే చెడును దృష్టిని ''దిష్టి'' అంటారు. దీని గురించి ఒక నానుడి కూడా మనకు తెలిసిందే. ''నరుడు దృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది'' అంటారు. దీని అనుభవం పొందిన వారికి దీని ప్రభావం ఎలా ఉంటుందో తెలు

కీడు కలిగించే చెడును దృష్టిని ''దిష్టి'' అంటారు. దీని గురించి ఒక నానుడి కూడా మనకు తెలిసిందే. ''నరుడు దృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది'' అంటారు. దీని అనుభవం పొందిన వారికి దీని ప్రభావం ఎలా ఉంటుందో తెలుస్తుంది. 
 
దృష్టి అంటే చూపు. మనం చూసేది. సహజంగా దేనినైనా చూడటం వలన హాని ఉండదు. కానీ ఈర్ష్యా ద్వేషాలతో దేనినైనా చూడటం వలన హాని ఉండదు. కానీ ఈర్ష్యా ద్వేషాలతో చూసే చెడు దృష్టి చాలా హాని చేస్తుంది. ఆ చెడుదృష్టి తాకే మనిషినైనా, మరిదేనినైనా మాడి మసి చేస్తుంది. పిడుగు పడిన పుడు చెట్లు ఎలా మాడిపోతాయో, అట్లే ఈ చెడు దృష్టి ప్రభావం వుంటుంది. ఈ విషయాన్ని నిరాధారమైనదిగా మనం తీసుకోకూడదు. 
 
అనుభవంలో ఇది చాలామందికి తెలిసిన సత్యం. దుకాణాల్లో వ్యాపారం చేసుకునే వ్యాపారస్తులు.. ప్రతి శుక్రవారం, అమావాస్య రోజుల్లో కర్పూరం వెలిగించి, తమ దుకాణాల ముందు నిమ్మకాయలు, ఎండు మిరపకాయలు, ఒక దండగా గుచ్చి కట్టడం, బూడిద గుమ్మడి కాయ కట్టడం, పటిక, కొబ్బరికాయ, ఉట్టిలో వేలాడదీయడం, కొబ్బరికాయ కొట్టి పడేయడం, దిష్టితీసి బూడిద గుమ్మడి కాయ కొట్టి పారేయడం, నిమ్మకాయలు దిష్టితీసి పారేయడం, పసుపు నీళ్ళతో శుద్ధి చేసుకోవడం మనం తరచూ చూస్తూవుంటాం.
 
ఇదంతా యజమానికి, వ్యాపార సంస్థకు నరదృష్టి దోషము  తగలకుండా ఉండటానికే, ఇప్పటికీ ఈ పద్ధతి ఆచారంగా ఉన్నది. ఈ విధంగా చెడు ప్రభావం నుంచి తమ వ్యాపార సంస్థలను, పిల్లలను రక్షించుకోవడానికి అనేక పద్ధతులు అవలంభిస్తుంటారు ఇలాంటి పద్ధతులను మూఢనమ్మకాలుగా తీసిపారేయకూడదు. ఇందులో నిజం దాగివుంది. కనుకనే మన పూర్వీకులు అనుసరించే పద్ధతులు అర్థం లేనివి కావు. అనుభవం ద్వారానే నిజాలను మనం నమ్మగలం. 
 
ఈ వైజ్ఞానిక యుగంలో అనేక భయంకరమైన వ్యాధులను నయం చేసేందుకు ఎన్నో కొత్త కొత్త మందులు కనిపెట్టడం జరిగింది. జరుగుతోంది కూడా. కాని ఈ దిష్టి దుష్ప్ర భావాన్ని అణచి వేసేందుకు ఏ వైజ్ఞానికుడు ఏ విరుగుడు కనిపెట్టలేకపోయాడు. కనీసం ఈ విషయమై ఎలాంటి పరిశోధన చేయనులేదు. ఇది మూఢనమ్మకమని కొందరు వాదిస్తారు. 
 
కానీ దిష్టిని సమూలంగా నాశనం చేసి ప్రపంచాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. పూర్వం మనదేశంలో ప్రసిద్ధి చెందిన అనేక మంది సిద్ధిపురుషులు వున్నారు. వారిలో మహా శ్రేష్ఠుడైన అగస్త్య మహాముని ఒకడు. ఈ మహాశక్తి ఉద్భవానికి ఆ ముని కారణమయ్యాడు. ఆ మహాశక్తి పేరు సర్వశక్తి వంతుడైన ''శుభదృష్టి గణపతి'' అశుభ దృష్టి అయిన దిష్టి రాక్షసుని సంహరించగల ఒకే ఒక్క దైవశక్తి మహాగణపతి యొక్క అనేక రూపాలలో 33వ రూపమే ఈ ''శుభదృష్టి గణపతి''. 
 
ఈ శుభదృష్టి గణపతి యొక్క రూపం చాలా విచిత్రంగా వుంటుంది. శ్రీ మహావిష్ణువు తర్వాత శంఖు, చక్రాలను ధరించిన దైవశక్తి. శ్రీమహేశ్వరునివలె ఈయన త్రినేత్రుడు. త్రిశూలధారిగా ఈయన జగన్మాత యొక్క అంశం. ఇతర దేవతల వలె అనేక ఆయుధాలను ధరించి, సింహమును వాహనంగా చేసుకుని వుంటాడు. మూషికము  కూడా ఈయన పాదాల చెంత వుంటుంది. మహా పరాక్రమశాలి రూపంతో ఈ మహాగణపతి పూర్ణ వికసిత పద్మంలో విజయోత్సాహ వీరునిలా నిలబడి వుంటాడు. తొమ్మిది నాగదేవతలు ఈయన తలచుట్టూ తిరిగి వుంటారు. 
 
ప్రజ్వలించు అగ్ని జ్వాలలో ఏభై ఒక్క నేత్రాలతో తన సాధారణ స్వరూపానికి విరుద్ధంగా తన విశ్వరూపంతో రుద్ర స్వరూపుడు ''శుభదృష్టి గణపతి"గా ఉద్భవించుట జరిగింది. సర్వజనులకు మేలు చేకూర్చే ఈ శుభదృష్టి గణపతి ఒక్కడే దిష్టి అనే దృష్టిని సంహరించి.. సర్వజనాలను రక్షించి, శుభం, సుఖశాంతులు సమృద్ధిగా అందిస్తాడు. ఈ ''శుభదృష్టి గణపతి'' దివ్యరూపాన్ని ఇంటిలో వుంచుకుని నిత్యం పూజించడం ద్వారా ఇంట్లోని యావన్మంది గృహసభ్యులుపై ప్రసరించే దిష్టి యొక్క దుష్ప్రభావం సూర్యరశ్మి సోకిన మంచులా కరిగిపోతుంది. 
 
ఈ శుభదృష్టి గణపతిని కంపెనీలు, ఫ్యాక్టరీలు, ఆఫీసులు, దుకాణాల్లో పూజించడం వల్ల దుష్ట శక్తుల ప్రభావాలు తొలగి మంచి లాభాలు, అభివృద్ధి చేకూరుతుంది. ప్రతీ ఒక్కరూ ఈ శుభదృష్టి గణపతిని ఆరాధించాలి. గృహంలో ఈ శుభదృష్టి గణపతి పటాన్ని గోడపై ఉత్తరదిశ చూసేలా తగిలించాలి. పూజాగదిలో కానీ, ఇంటికి వచ్చే అందరి దృష్టి ఆకర్షించే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఈ శుభదృష్టి గణపతి శత్రువులను సంహరించి, యుద్ధరంగం నుంచి వచ్చిన విజేతలా, విజయలక్ష్మి వరించిన వీరునిగా సమర రూపంతో విజయోత్సాహంతో దర్శనమిస్తాడు.