శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By chj
Last Modified: శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (21:59 IST)

కర్పూరంతో కర్మలన్నీ తొలగిపోతాయి...

ధనవంతులు కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అయితే ధనాన్ని సంపాదించే మార్గం తెలియక వివిధ పద్థతులను ఫాలో అవుతుంటారు. ఏదీ కలిసిరాక చేపట్టిన పనిలో ఆటంకాలు ఎదురై నిరాశకు గురవుతుంటారు. మరికొంతమందయితే డబ్బు వచ్చినా ఆ డబ్బును నిలబెట్టుకోలేక కష్టాల ఊబిలో కూరుక

ధనవంతులు కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అయితే ధనాన్ని సంపాదించే మార్గం తెలియక వివిధ పద్థతులను ఫాలో అవుతుంటారు. ఏదీ కలిసిరాక చేపట్టిన పనిలో ఆటంకాలు ఎదురై నిరాశకు గురవుతుంటారు. మరికొంతమందయితే డబ్బు వచ్చినా ఆ డబ్బును నిలబెట్టుకోలేక కష్టాల ఊబిలో కూరుకుపోతూ ఉంటారు. ఈ కష్టాలన్నింటికి కారణం లక్ష్మీ కటాక్షం లేకపోవడమేనట. అలాంటి వారు కర్పూరంతో ఇలా చేస్తే అష్టయిశ్వర్యాలతో తులతూగడం ఖాయమంటున్నారు జ్యోతిష్యులు.
 
ఆర్థికంగా ఇబ్బందులు పడేవారు ఉదయాన్నే తలస్నానం చేసి లక్ష్మీదేవికి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి...దాంతో పాటు ఐదు కర్పూరం బిల్లలను తీసుకుని ఒక ఎర్రగుడ్డలో మూటగట్టి ఆ మూటను లక్ష్మీదేవి ముందు పెట్టి అగరబత్తితో దూపం వేయాలి. తరువాత తాము ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని లక్ష్మీదేవిని ప్రార్థించాలి. 
 
ఆ తరువాత కర్పూరాలతో అమ్మవారికి పూజ చేయాలి. అంతా అయిన తరువాత లక్ష్మీదేవి ముందున్న మూటను తీసుకుని బీరువాలో మనం ఎక్కడైతే డబ్బు, బంగారాన్ని దాచుతామో ఆ ప్రదేశంలో ఉంచాలి. అలా ఉంచినట్లు ఎవరికి చెప్పకూడదు. చివరకు భార్య కు కూడా చెప్పకూడదు. అలా ప్రారంభించిన కొన్నిరోజులకే మీకు ఫలితం కనిపిస్తుంది.