శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 28 డిశెంబరు 2017 (10:58 IST)

రూ.168.84 కోట్ల ఆదాయంతో శబరిమల అయ్యప్ప స్వామి కొత్త రికార్డు

శబరిమల అయ్యప్ప స్వామి కొత్త రికార్డు సృష్టించారు. భక్తులు అందించే కానుకల విషయంలో పాత రికార్డులను అయ్యప్ప స్వామి ఆలయం బ్రేక్ చేసింది. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 26వరకు ఆలయంలో జరిగిన మండల పూజలతో అయ్యప్ప ఆ

శబరిమల అయ్యప్ప స్వామి కొత్త రికార్డు సృష్టించారు. భక్తులు అందించే కానుకల విషయంలో పాత రికార్డులను అయ్యప్ప స్వామి ఆలయం బ్రేక్ చేసింది. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 26వరకు ఆలయంలో జరిగిన మండల పూజలతో అయ్యప్ప ఆలయానికి మొత్తం రూ.168.84కోట్ల ఆదాయం లభించింది. ఇది ఆల్ టైమ్ రికార్డు అని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డ్ అధికారులు ప్రకటించారు. 
 
అయ్యప్ప దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య ప్రతియేటా పెరుగుతోందని, ఇంకా మకరజ్యోతి ఉత్సవాలు జరుగున్న తరుణంలో భక్తులు అయ్యప్పకు సమర్పించే కానుకల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని దేవస్థానం అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. హుండీ, టిక్కెట్లు, ప్రసాదాల లెక్కల్లో నవంబర్ 15 నుంచి డిసెంబర్ 25వ తేదీ వరకు గత ఏడాది కంటే ఈ ఏడాది.. రూ.20కోట్ల మేర ఆదాయం పెరిగిందని కేరళ దేవస్థానం-పర్యాటక మంత్రి  కొడకంపల్లి సురేందర్ తెలిపారు.
 
మకర జ్యోతి ఉత్సవాల కోసం డిసెంబర్ 30 నుంచి జనవరి 14వరకు ఆలయం తెరిచి వుంటుందని.. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామిని దర్శించుకునే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. పంబా నదీ ప్రాంతంలో, నడకదారిన భక్తుల కోసం కుర్చీలు ఏర్పాటు చేస్తామని.. ఇతరత్రా సౌకర్యాలను కల్పించే దిశగా సమీక్ష నిర్వహిస్తామని మంత్రి తెలిపారు.