శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 20 నవంబరు 2017 (12:40 IST)

అయ్యప్ప స్వామి అష్టకంలో మార్పు..

కార్తీక మాసంలో అయ్యప్ప స్వామి భక్తులు స్వామి దర్శనార్థం కేరళకు వెళ్తుంటారు. పవిత్ర మాలలు ధరించి.. అయ్యప్ప స్వామిని దర్శించుకునే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోందని దేవస్థానం వెల్లడించింది. ఈ నేపథ్యం

కార్తీక మాసంలో అయ్యప్ప స్వామి భక్తులు స్వామి దర్శనార్థం కేరళకు వెళ్తుంటారు. పవిత్ర మాలలు ధరించి.. అయ్యప్ప స్వామిని దర్శించుకునే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోందని దేవస్థానం వెల్లడించింది. ఈ నేపథ్యంలో పంబానది తీరాన, శబరిగిరుల్లో వెలసి కోట్లాది మంది కొంగుబంగారమైన అయ్యప్ప స్వామిని నిద్రపుచ్చుతూ పాడే జోలపాట 'హరివరాసనం నిత్యమోహనం' అష్టకంలోలోని చిన్న తప్పును సరిదిద్దాలని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు (టీబీడీ) నిర్ణయించింది. 
 
ఈ శ్లోకాల్లోని కొన్ని సంస్కృత పదాలు రూపాంతరం చెందాయని.. మరికొన్ని అసలుకే లేవని టీబీడీ తెలిపింది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న కేజే ఏసుదాస్ రాగానే, సరిదిద్దిన ''హరివరాసనం'' రికార్డు చేస్తామని టీబీడీ వెల్లడించింది. ఈ అష్టకంలోని 'అరివిమర్దనం... నిత్యనర్తనం' అన్న వాక్యంలో 'అరి' అంటే శత్రువని, 'మర్దనం' అంటే నాశనం చేయడమన్న అర్థం వస్తుంది. ప్రస్తుతం ఈ రెండు పదాలనూ కలిపి పలుకుతుండగా, మారిన శ్లోకంలో రెండు విడివిడి పదాలుగా ఉంటాయని తెలిపింది.
 
1975 మలయాళ సినిమా స్వామి అయ్యప్పన్ కోసం ఈ పాట రికార్డ్ అయ్యింది. ప్రస్తుతం ఈ పాటలోని హరివరాసనం అష్టకాన్ని మార్చేందుకుగాను జేసుదాస్‌తో చర్చించినట్లు టీబీడీ తెలిపింది. ఇక శబరిమల ఆలయం నవంబర్ 15 నుంచి ప్రారంభమైంది. ఈ ఆలయం మూడు నెలల పాటు మకర జ్యోతి కోసం తెరిచే వుంటుంది. 41 రోజుల పాటు జరిగే మండల పూజ డిసెంబర్ 26తో ముగియనుంది.