శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 3 ఆగస్టు 2018 (13:36 IST)

ఆగమోక్తంగా మహాసంప్రోక్షణం.. 1.80 లక్షల మందికి దర్శనం : ఈవో అనిల్ కుమార్

కలియుగదైవం శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం(తిరుమల తిరుపతి దేవస్థానం)లో మహాసంప్రోక్షణ మహాఘట్టం జరుగనుంది. ఈనెల 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు జరిగే ఈ మహత్తర కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసినట్టు తిత

కలియుగదైవం శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం(తిరుమల తిరుపతి దేవస్థానం)లో మహాసంప్రోక్షణ మహాఘట్టం జరుగనుంది. ఈనెల 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు జరిగే ఈ మహత్తర కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసినట్టు తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.
 
ఇదే అంశంపై ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తిరుమల శ్రీవారి ఆలయంలో అష్టబంధన బలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని ఈ నెల 11 నుండి 16వ తేదీ వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసినట్టు తెలిపారు. 
 
ఈ ఘట్టం ఆగమోక్త౦గా మహాసంప్రోక్షణ నిర్వహిస్తామని తెలిపారు. వైదిక కార్యక్రమం నిర్వహణ నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే భక్తులకు అనుమతిస్తామని, సంప్రోక్షణ సమయంలో ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు పూర్తిగా రద్దు చేస్తామని తెలిపారు. 
 
ఈ ఆరు రోజుల్లో కేవలం లక్షా 80 వేల మంది భక్తులకు మూలవిరాట్టు దర్శనాని కల్పిస్తామని చెప్పారు. అధిక మాసం నేపథ్యంలో ఈ ఏడాది శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని వెల్లడించిన ఆయన... ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామన్నారు.