1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : బుధవారం, 27 జూన్ 2018 (13:41 IST)

చనిపోయిని వారిని ఉరేగించేటప్పుడు డబ్బులు ఎందుకు వేస్తారాంటే...

ఏ దేవుని మాలలో ఏ దారాలు వాడాలంటే విష్ణుమాలలో నల్లటి పట్టుదిగాని, నూలు దారం గాని వాడాలి. అమ్మవారికి ఎర్రటి పట్టుదారం మాలగానూ, పరమశివునకు పసుపు ఊలుదారమూ, సూర్యభగవానుడికి పట్టుదారముగాని నూలు దారం గాని, వ

ఏ దేవుని మాలలో ఏ దారాలు వాడాలంటే విష్ణుమాలలో నల్లటి పట్టుదిగాని, నూలు దారం గాని వాడాలి. అమ్మవారికి ఎర్రటి పట్టుదారం మాలగానూ, పరమశివునకు పసుపు ఊలుదారమూ, సూర్యభగవానుడికి పట్టుదారముగాని నూలు దారం గాని, వినాయకుడికి ఆకుపచ్చ పట్టుదారం, నూలు దారము వాడాలి.
 
ఇంటిపేరుతో ఉన్నవారు దారాన్ని చుట్టాలి. మీ కోసం మీరు చుట్టుకున్నది ధరించడం ద్వారా అత్యంత శక్తిని పొందుతారు. వేరే ఎవరైనా చుట్టిన మాల ధరించే ముందు పంచవ్యములతో శుద్ధి చేసి ధరించాలి. 
 
చనిపోయిన వారిని ఊరేగించేటప్పుడు డబ్బులెందుకు వేస్తారంటే నేనెంతో ధనం సంపాదించానా ఒక్క పైసా కూడా తీసుకెళ్ళడం లేదు. రేపు మీ ధనమయినా ఇంతే. కనుక ధర్మంగా న్యాయంగా జీవిస్తూ పదిమందికీ సాయం చేసి పోవడమే అసలు మానవ ధర్మం. కాబట్టి మీరయినా స్వార్థ చింతనలకు దూరంగా ఉండి పదిమందికి మేలు చేయండని దాని అర్థం.